News March 24, 2025
ఇకపై వారి అకౌంట్లలోనే పింఛన్ జమ

AP: సామాజిక పింఛన్లు తీసుకుంటున్న దివ్యాంగ విద్యార్థులకు ప్రభుత్వం ఊరట కలిగించింది. వారు గురుకులాలు, వసతి గృహాల నుంచి వచ్చి పింఛన్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంపై దృష్టి సారించింది. ఇకపై వారి అకౌంట్లలోనే పెన్షన్ జమ చేయాలని నిర్ణయించింది. దీనివల్ల సుమారు 10వేల మంది దివ్యాంగ స్టూడెంట్స్కి ఉపశమనం కలగనుంది.
Similar News
News January 30, 2026
282 పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

CSI ఈ గవర్నెన్స్ సర్వీస్ ఇండియా లిమిటెడ్లో 282 ఆధార్ సూపర్ వైజర్/ఆపరేటర్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. జిల్లా కేంద్రాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. TGలో 11, APలో 4 పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి టెన్త్+ITI, ఇంటర్ అర్హతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://cscspv.in *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News January 30, 2026
ఒక్క ఎక్స్ప్రెషన్తో పాపులర్.. ₹8,980Cr డీల్

టిక్టాక్ స్టార్ ఖబీ లేమ్ తన గ్లోబల్ బ్రాండ్(స్టెప్ డిస్టిన్క్టివ్ లిమిటెడ్)ని రూ.8,980 కోట్లకు రిచ్ స్పార్కిల్ అనే హాంకాంగ్ కంపెనీకి అమ్మేశారు. తన ఫేస్, వాయిస్తో ‘డిజిటల్ ట్విన్’ తయారు చేసి దాంతో కంటెంట్ క్రియేట్ చేస్తారు. దాని విలువ ఏడాదికి రూ.36వేల కోట్లని అంచనా. SM ప్లాట్ఫామ్స్లో ఖబీకి 238M ఫాలోవర్స్ ఉన్నారు. 2020లో మెకానిక్ జాబ్ పోయాక ఖబీ సైలెంట్ కామెడీ రియాక్షన్ వీడియోలు మొదలెట్టారు.
News January 30, 2026
పిల్లల్ని పట్టించుకుంటున్నారా?

ఈరోజుల్లో చాలా మంది తల్లిదండ్రులు ఉద్యోగం, పని ఒత్తిడిలోపడి తమ చిన్నారుల కోసం సమయం కేటాయించడం లేదు. దీంతో చాలా మంది పిల్లలు తమ ఆనందాలు, బాధలు, ఒత్తిడులను తల్లిదండ్రులతో షేర్ చేసుకోలేక డిప్రెషన్ బారిన పడుతున్నారు. అందుకే పేరెంట్స్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ పిల్లల కోసం కొంత సమయం కేటాయించి వారితో మాట్లాడి వారి ఆనందాలను, బాధలను తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.


