News April 2, 2024
పెన్షన్లు: ఈసీ ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్
AP: పెన్షన్ల పంపిణీ వ్యవహారం హైకోర్టుకు చేరింది. వాలంటీర్లతో పెన్షన్ పంపిణీ చేయొద్దన్న ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. ఈసీ ఆదేశాలను కొట్టివేయాలంటూ గుంటూరుకు చెందిన మహిళ హైకోర్టును కోరారు. వాలంటీర్లు ఇళ్లకు వచ్చి పెన్షన్లు ఇవ్వకపోతే ఇబ్బందులు వస్తాయని తెలిపారు. దీనిపై ఉన్నత న్యాయస్థానం రేపు విచారణ జరపనుంది.
Similar News
News October 7, 2024
HYDRA కూల్చివేతలతో తగ్గిన భూములు, ఆస్తుల కొనుగోళ్లు!
TG: నీటి వనరుల పరిరక్షణకు ప్రభుత్వం తీసుకొచ్చిన ‘హైడ్రా’ కూల్చివేతల ప్రభావం రాష్ట్రంలోని భూములు, ఆస్తుల కొనుగోళ్లపై పడింది. ఒక్క Septలోనే రిజిస్ట్రేషన్ ఆదాయం 30% తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి. గత ఏడాది Septలో దాదాపు లక్ష లావాదేవీలు జరిగి ₹955కోట్ల రాబడి రాగా ఈ సెప్టెంబర్లో లావాదేవీలు 80వేలకు పడిపోయి రాబడి సైతం ₹650కోట్లకే పరిమితమైంది. HYD, పరిసర జిల్లాల్లో దీని ప్రభావం ఎక్కువుంది.
News October 7, 2024
BIG ALERT: మళ్లీ తుఫాన్లు.. భారీ వర్షాలు
AP: ఈ నెలలో అరేబియా సముద్రంలో ఒకటి, బంగాళాఖాతంలో రెండు తుఫాన్లు ఏర్పడే అవకాశం ఉందని IMD వెల్లడించింది. వీటి ప్రభావంతో ఈ నెల 10 తర్వాత కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోవైపు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాబోయే 3 రోజులు రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు వానలు పడొచ్చని పేర్కొంది. ఇవాళ మన్యం, అల్లూరి, పల్నాడు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంది.
News October 7, 2024
ఆరో రోజు ‘అలిగిన బతుకమ్మ’
TG: బతుకమ్మ వేడుకల్లో ఆరో రోజును ‘అలిగిన బతుకమ్మ’గా పిలుస్తారు. పూర్వం బతుకమ్మను పేర్చే సమయంలో మాంసం తగిలి అపవిత్రం జరిగిందని ప్రచారంలో ఉంది. దీంతో ఇవాళ బతుకమ్మను తయారు చెయ్యరు. నైవేద్యం కూడా సమర్పించరు. అలక వీడాలని అమ్మవారిని మహిళలు ప్రార్థిస్తారు. అటు ఈరోజు దుర్గామాత శ్రీమహాచండీదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు.