News October 23, 2024
పెన్షన్ల సమస్యకు గ్రామ సభల్లో పరిష్కారం: ప్రభుత్వం

AP: గత ప్రభుత్వంలో అనర్హుల పేరిట తొలగించిన పింఛన్లపై క్యాబినెట్ భేటీలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షన్ల సమస్యను గ్రామ సభల ద్వారా పరిష్కరించాలని నిర్ణయించింది. అలాగే మంగళగిరి ప్రభుత్వాస్పత్రిని 100 పడకలుగా మార్చేందుకు ఆమోదం తెలిపింది. దేవాలయ పాలకమండళ్లలో బ్రాహ్మణులు, నాయీ బ్రాహ్మణులకు సభ్యత్వం ఇవ్వాలని, సభ్యుల సంఖ్యను 15 నుంచి 17కు పెంచాలని నిర్ణయించింది.
Similar News
News November 3, 2025
నిద్రపోయే ముందు రీల్స్ చూస్తున్నారా?

చాలామంది రీల్స్ చూస్తూ నిద్రను పాడు చేసుకుంటున్నారని వైద్యులు గుర్తించారు. స్క్రీన్ల నుంచి వచ్చే బ్లూ లైట్ నిద్రకు సహాయపడే మెలటోనిన్ హార్మోన్ను అణచివేస్తుందని తెలిపారు. ‘నిరంతర ఉద్దీపన వల్ల మెదడు విశ్రాంతి తీసుకోకుండా చురుకుగా ఉంటుంది. దీని ఫలితంగా నిద్ర నాణ్యత తగ్గి, మరుసటి రోజు బ్రెయిన్ ఫాగ్, చిరాకు పెరుగుతాయి. అందుకే నిద్రకు 30-60 నిమిషాల ముందు రీల్స్, టీవీ చూడకండి’ అని సూచించారు.
News November 3, 2025
కంకర ఓవర్ లోడ్ కారణంగానే ప్రమాదం!

TG: చేవెళ్ల బస్సు ప్రమాదానికి సంబంధించి కీలకాంశాలు వెలుగులోకి వచ్చాయి. కంకర ఓవర్లోడ్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఘటనా సమయంలో టిప్పర్లోనే యజమాని లక్ష్మణ్ ఉన్నారు. లడారం-శంకర్పల్లి వరకు టిప్పర్ను ఆయనే నడిపారు. ఆ తర్వాత డ్రైవర్ ఆకాశ్కు ఇచ్చారు. గాయపడిన లక్ష్మణ్ నిమ్స్లో చికిత్స పొందుతున్నారు. కండక్టర్ రాధ ఫిర్యాదుతో చేవెళ్ల పోలీసులు కేసు నమోదు చేశారు.
News November 3, 2025
ఢిల్లీలో కాలుష్య నివారణ చర్యలపై అఫిడవిట్ ఇవ్వండి: సుప్రీం

ఢిల్లీలో వాయుకాలుష్య నివారణకు తీసుకుంటున్న చర్యలపై అఫిడవిట్ సమర్పించాలని సుప్రీంకోర్టు కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంటును ఆదేశించింది. వాయు పర్యవేక్షణ కేంద్రాలు పనిచేయడం లేదన్న మీడియా వార్తలపై ప్రశ్నించింది. CPCB, DPCC, NCR పరిధిలోకి వచ్చే జిల్లాల్లో OCT 14-25 మధ్య పరీక్షించిన గాలి నాణ్యత నివేదికల్ని సమర్పించాలని చెప్పింది. CJI గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ ఈ కేసును విచారించి ఆదేశాలిచ్చారు.


