News October 23, 2024
పెన్షన్ల సమస్యకు గ్రామ సభల్లో పరిష్కారం: ప్రభుత్వం

AP: గత ప్రభుత్వంలో అనర్హుల పేరిట తొలగించిన పింఛన్లపై క్యాబినెట్ భేటీలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షన్ల సమస్యను గ్రామ సభల ద్వారా పరిష్కరించాలని నిర్ణయించింది. అలాగే మంగళగిరి ప్రభుత్వాస్పత్రిని 100 పడకలుగా మార్చేందుకు ఆమోదం తెలిపింది. దేవాలయ పాలకమండళ్లలో బ్రాహ్మణులు, నాయీ బ్రాహ్మణులకు సభ్యత్వం ఇవ్వాలని, సభ్యుల సంఖ్యను 15 నుంచి 17కు పెంచాలని నిర్ణయించింది.
Similar News
News December 15, 2025
మహబూబ్ నగర్ జిల్లా నేటి ముఖ్యంశాలు

@మహబూబ్ నగర్ జిల్లాల్లో రెండో దశ గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.
@మిడ్జిల్ మండల కేంద్రంలో జిల్లా ఎస్పీ. డి.జానకి ఎన్నికల పోలింగ్ను పరిశీలించారు.
@కౌకుంట్ల మండలంలో 12 గ్రామపంచాయతీలకు గాను.. 10 గ్రామపంచాయతీలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు.
@దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి స్వగ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి పావని 110 ఓట్లతో గెలుపొందింది.
@ మిడ్జిల్లో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు.
News December 15, 2025
ఖమ్మం జిల్లాలో TDP మద్దతుదారు విజయం

TG: ఖమ్మం జిల్లా కామేపల్లి మేజర్ గ్రామ పంచాయతీని టీడీపీ సొంతం చేసుకుంది. సర్పంచ్ ఎన్నికల్లో TDP బలపరిచిన అభ్యర్థి అజ్మీర బుల్లి విజయం సాధించారు. బీజేపీ, BRS, జనసేన పార్టీల మద్దతుతో గెలిచినట్లు తెలుస్తోంది. ఏడేళ్ల క్రితం ఆమె భర్త హరినాయక్ సర్పంచ్గా గెలవగా, ఇప్పుడు బుల్లి గెలుపొందారు. కాగా మొదటి విడతలో ఖమ్మం జిల్లాలో టీడీపీ మద్దతుదారులు మూడు పంచాయతీలను సొంతం చేసుకున్నారు.
News December 14, 2025
సుస్థిర ఆర్థిక పురోగతిలో ఏపీ: RBI

దేశంలో పలు రంగాల్లో ఏపీ అగ్రస్థానంలో నిలిచినట్లు RBI తాజా నివేదిక వెల్లడించింది. ‘1.93 కోట్ల టన్నుల పండ్లు, 51.58 లక్షల టన్నుల చేపలు ఉత్పత్తి చేసి రెండింటిలోనూ అగ్రస్థానంలో ఉంది. FY24-25లో GSDP ₹15.93 లక్షల CRకు చేరగా తలసరి జీఎస్డీపీ ₹2.66 లక్షలుగా నమోదైంది. ఆరోగ్య పరంగా సగటు జీవితకాలం 70 ఏళ్లకు పెరిగింది. 74 మార్కులతో సుస్థిర అభివృద్ధి లక్ష్య సాధనలో 10వ ప్లేస్లో ఉంది’ అని ప్రభుత్వం తెలిపింది.


