News October 23, 2024
పెన్షన్ల సమస్యకు గ్రామ సభల్లో పరిష్కారం: ప్రభుత్వం

AP: గత ప్రభుత్వంలో అనర్హుల పేరిట తొలగించిన పింఛన్లపై క్యాబినెట్ భేటీలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షన్ల సమస్యను గ్రామ సభల ద్వారా పరిష్కరించాలని నిర్ణయించింది. అలాగే మంగళగిరి ప్రభుత్వాస్పత్రిని 100 పడకలుగా మార్చేందుకు ఆమోదం తెలిపింది. దేవాలయ పాలకమండళ్లలో బ్రాహ్మణులు, నాయీ బ్రాహ్మణులకు సభ్యత్వం ఇవ్వాలని, సభ్యుల సంఖ్యను 15 నుంచి 17కు పెంచాలని నిర్ణయించింది.
Similar News
News December 16, 2025
ఆరోగ్యం, ఐశ్వర్యం తిరిగి పొందేందుకు..

అశాంతి, అనారోగ్యం, ఐశ్వర్య నష్టం మిమ్మల్ని వేధిస్తున్నాయా? అయితే పరమేశ్వరుడిని ప్రసన్నం చేసే రుద్రహోమం మీకు సరైనది. ఇందులో శ్రీరుద్రం, శివ పంచాక్షరి వంటి మంత్రోచ్ఛారణలతో పాటు పరమేశ్వరుడికి ప్రీతికరమైన ఆహుతులను పూజారులు అగ్నికి సమర్పిస్తారు. దీంతో అనారోగ్యం, నెగెటివ్ ఎనర్జీ దూరమై శివుడి అనుగ్రహంతో అర్థ, అంగ బలం పొందుతారు. అందుబాటు ఛార్జీల్లో పూజ, వివరాల కోసం <
News December 16, 2025
మోదీకి గాంధీ ఆశయాలు నచ్చవు: రాహుల్ గాంధీ

గాంధీజీ ఆశయాలు, పేదల హక్కులు ప్రధాని మోదీకి నచ్చవని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఉపాధి హామీ పథకం పేరు మార్పుతో గ్రామీణ పేదల జీవనోపాధిని దెబ్బతీయాలని చూస్తున్నారని మండిపడ్డారు. పదేళ్ల నుంచి ఆ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. MGNREGAపై కొత్త బిల్లు ప్రవేశపెట్టడం గాంధీని అవమానించడమేనన్నారు. నిరుద్యోగంతో ఇప్పటికే యువత భవిష్యత్తును మోదీ నాశనం చేశారని చెప్పారు.
News December 16, 2025
HILTP లీక్ వెనుక ఓ మంత్రి, సీనియర్ IAS!

TG: <<18457165>>HILTP<<>> లీక్ కేసులో విజిలెన్స్ విచారణ ముగిసింది. CM రేవంత్కు విచారణ నివేదికను అధికారులు అందించారు. ఓ మంత్రి, సీనియర్ IAS అధికారి పాలసీ వివరాలు లీక్ చేశారని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ తరువాత BRS నేతలకు వాటిని చేరవేశారని తేల్చారు. మంత్రి సూచనతో అలా చేశానని అధికారి చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా అధికారి కావాలనే మంత్రిని ఇరికిస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి.


