News October 23, 2024
పెన్షన్ల సమస్యకు గ్రామ సభల్లో పరిష్కారం: ప్రభుత్వం

AP: గత ప్రభుత్వంలో అనర్హుల పేరిట తొలగించిన పింఛన్లపై క్యాబినెట్ భేటీలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షన్ల సమస్యను గ్రామ సభల ద్వారా పరిష్కరించాలని నిర్ణయించింది. అలాగే మంగళగిరి ప్రభుత్వాస్పత్రిని 100 పడకలుగా మార్చేందుకు ఆమోదం తెలిపింది. దేవాలయ పాలకమండళ్లలో బ్రాహ్మణులు, నాయీ బ్రాహ్మణులకు సభ్యత్వం ఇవ్వాలని, సభ్యుల సంఖ్యను 15 నుంచి 17కు పెంచాలని నిర్ణయించింది.
Similar News
News December 23, 2025
గిఫ్ట్ అని క్లిక్ చేస్తే.. అంతా ఫట్: ప్రకాశం పోలీస్ హెచ్చరిక

వాట్సాప్లకు గిఫ్టుల పేరిట వచ్చే ఏపీకె ఫైల్స్ను క్లిక్ చేయవద్దని పోలీసులు మంగళవారం కీలక సూచన చేశారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఐటీ విభాగం పోలీసులు సైబర్ నేరాలపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా గిఫ్ట్ పేరిట వచ్చే ఏపీకే ఫైల్స్ పట్ల తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు. అపరిచిత వ్యక్తులు పంపించే వీటిని క్లిక్ చేసి, డబ్బులు పోగొట్టుకోవద్దన్నారు.
News December 23, 2025
‘జాతీయ రైతు దినోత్సవం’ వెనుక కథ ఇదే..

రైతు కుటుంబంలో పుట్టి తన చివరి క్షణం వరకు అన్నదాతల సంక్షేమం కోసం కృషి చేసిన వ్యక్తి మాజీ ప్రధాని ‘చౌదరి చరణ్ సింగ్’. ఆయన కృషి, పోరాటం వల్ల ‘జమీందారీ చట్టం’ రద్దై ‘కౌలుదారీ చట్టం’ అమల్లోకి వచ్చింది. రైతులకు బ్యాంకు రుణాలిచ్చే విధానం వచ్చింది. అందుకే చరణ్ సింగ్ను ‘రైతు బంధు’గా పిలుస్తారు. రైతులకు చేసిన సేవలకు గుర్తుగా చరణ్ సింగ్ పుట్టినరోజైన DEC-23ను ‘జాతీయ రైతు దినోత్సవం’గా జరుపుకుంటున్నారు.
News December 23, 2025
హిందూ మహిళలతోనూ అలానే చేయగలరా?: జావేద్ అక్తర్

బిహార్ CM నితీశ్ కుమార్ మహిళా డాక్టర్ హిజాబ్ <<18574954>>లాగడం<<>> విమర్శలకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై బాలీవుడ్ రచయిత జావేద్ అక్తర్ మండిపడ్డారు. ‘నితీశ్ చేసిన పని అసభ్యకరంగా ఉంది. ఇతరులను అగౌరవపరిచే హక్కు ఎవరికీ లేదు. కొన్ని ఏరియాల్లో హిందూ మహిళలు ముఖం కనిపించకుండా ఘూంఘట్ (దుపట్టా, చీరకొంగు) కప్పుకుంటారు. వాటినీ లాగుతారా?’ అని ప్రశ్నించారు.


