News April 27, 2024
ఇంటింటికీ పెన్షన్లు పంపిణీ చేయాలి: కూటమి నేతలు

AP: పెన్షన్ల పంపిణీపై ఈసీ ఆదేశాలను పక్కాగా అమలు చేయాలని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు సీఎస్ జవహర్రెడ్డిని కోరారు. సచివాలయంలో సీఎస్ను కలిసిన కూటమి నేతలు.. ‘మే నెల పెన్షన్ కోసం ఎవరూ ఇబ్బంది పడకుండా చూడాలని కోరాం. వచ్చే నెల పెన్షన్ పంపిణీలో ఒక్క ప్రాణం కూడా పోకుండా చూడాలి. ప్రభుత్వ కుట్రలను ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈసీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా అమలు చేయకపోవడం ఏంటి?’ అని ప్రశ్నించారు.
Similar News
News October 16, 2025
ఆంధ్రా వంటకాలే కాదు.. పెట్టుబడులూ స్పైసీ: లోకేశ్

AP: విశాఖతో పాటు రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులపై మంత్రి నారా లోకేశ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘ఆంధ్రా వంటకాలు స్పైసీ అంటారు. మా పెట్టుబడులు కూడా అలాగే అనిపిస్తున్నాయి. కొంతమంది పొరుగువారు ఇప్పటికే ఆ మంట అనుభవిస్తున్నారు’ అని పేర్కొన్నారు. రెండ్రోజుల కిందట విశాఖలో గిగా వాట్ కెపాసిటీతో డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే.
News October 16, 2025
మితిమీరిన డైట్ జీవక్రియను దెబ్బతీస్తుంది: వైద్యులు

జీవక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.. ‘మితిమీరిన ఆహార నియంత్రణ పద్ధతులు మీ శరీరాన్ని తీవ్ర ఒత్తిడికి గురిచేస్తాయి. నాణ్యమైన ప్రోటీన్ను తగినంతగా ఆహారంలో చేర్చుకోవడం చాలా ముఖ్యం. వెయిట్స్ ఎత్తడం లేదా రెసిస్టెన్స్ బ్యాండ్లతో చేసే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వ్యాయామాలు కండరాల నిర్మాణానికి సహాయపడతాయి. రోజూ 7-8 గంటలు నిద్రపోవడం ముఖ్యం’ అని చెబుతున్నారు.
News October 16, 2025
మధ్యాహ్నం కేబినెట్ భేటీ.. సురేఖ వస్తారా..?

తెలంగాణ కాంగ్రెస్లో కొండా దంపతుల వ్యవహారం మరింత ముదిరింది. పొంగులేటిపై టెండర్ల విషయంలో కామెంట్లు సహా, రెడ్లంతా తమ ఫ్యామిలీపై కుట్ర చేస్తున్నారని ఆమె కూతురు ఆరోపణలు చేయడం తెలిసిందే. ఇవాళ మధ్యాహ్నం కేబినెట్ భేటీ ఉండగా ఆమె వస్తారా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. అటు సురేఖ రాజీనామా చేస్తారని కొందరు, ఆమెను తప్పిస్తారని మరికొందరు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది.