News April 27, 2024

ఇంటింటికీ పెన్షన్లు పంపిణీ చేయాలి: కూటమి నేతలు

image

AP: పెన్షన్ల పంపిణీపై ఈసీ ఆదేశాలను పక్కాగా అమలు చేయాలని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు సీఎస్ జవహర్‌రెడ్డిని కోరారు. సచివాలయంలో సీఎస్‌ను కలిసిన కూటమి నేతలు.. ‘మే నెల పెన్షన్ కోసం ఎవరూ ఇబ్బంది పడకుండా చూడాలని కోరాం. వచ్చే నెల పెన్షన్ పంపిణీలో ఒక్క ప్రాణం కూడా పోకుండా చూడాలి. ప్రభుత్వ కుట్రలను ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈసీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా అమలు చేయకపోవడం ఏంటి?’ అని ప్రశ్నించారు.

Similar News

News November 22, 2025

AP TET..అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

ఏపీ టెట్‌కు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. రేపటితో అప్లికేషన్ల ప్రాసెస్ ముగియనుండటంతో అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులకు మాక్ టెస్ట్ ఆప్షన్ NOV 25న అందుబాటులోకి వస్తుంది. DEC 3నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. DEC 10 నుంచి ప్రతిరోజూ 2 సెషన్లలో ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ అర్హత తప్పనిసరి అని సుప్రీంకోర్టు పేర్కొంది. వెబ్‌సైట్: https://tet2dsc.apcfss.in/

News November 22, 2025

పంట మునిగినా, జంతువుల దాడిలో దెబ్బతిన్నా ఫసల్ బీమా

image

PM ఫసల్ బీమా యోజనలో ఇప్పటి వరకు కరవు, వడగళ్లు, తుఫాన్ల వల్ల పంట నష్టం జరిగితే బీమా చెల్లించేవారు. ఇక నుంచి దాని పరిధి పెంచారు. ఏనుగులు, అడవి పందులు, కోతులు వంటి జంతువుల వల్ల పంట నాశనమైతే ఇకపై బీమా వర్తిస్తుంది. భారీ వర్షాల వల్ల పొలాలు నీట మునిగి పంట కుళ్లిపోయినా, దెబ్బతిన్నా పరిహారం చెల్లిస్తారు. 2026 ఖరీఫ్ సీజన్ (జూన్-జులై) నుంచి ఇది అమల్లోకి వస్తుంది. 2025-26 ఖరీఫ్ సీజనుకు ఇది వర్తించదు.

News November 22, 2025

పంట దెబ్బతిన్న 72 గంటల్లోపు సమాచారం ఇవ్వాలి

image

జంతువుల దాడి, భారీ వర్షాలతో పొలాలు నీట మునిగి దెబ్బతింటే.. 72 గంటల్లోపు రైతులు వ్యవసాయ శాఖకు లేదా బీమా కంపెనీకి రైతులు సమాచారం అందించాలి. ‘క్రాప్ ఇన్సూరెన్స్ యాప్’లో నష్టపోయిన పంట ఫొటోలను జియో ట్యాగింగ్ చేసి అప్లోడ్ చేయాలి. ఏ జంతువుల వల్ల ఏ ఏ జిల్లాల్లో ఎక్కువ పంట నష్టం జరుగుతుందో రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి నోటిఫై చేయాలి. ఆ వివరాల ఆధారంగానే బీమా వర్తిస్తుందని కేంద్రం తెలిపింది.