News December 12, 2024
వారికీ పింఛన్లు ఇవ్వాలి: సీఎం చంద్రబాబు

AP: తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకూ పింఛన్లు ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. కలెక్టర్ల సదస్సులో ఈమేరకు ఆయన సూచించారు. ఇక రానున్న 3 నెలల్లో అనర్హులను గుర్తించి పింఛన్లు కట్ చేయాలని స్పష్టం చేశారు. ఆ తర్వాత కూడా అనర్హులు తేలితే కలెక్టర్లను బాధ్యులను చేస్తానని హెచ్చరించారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6 లక్షల మంది అనర్హులకు పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
Similar News
News December 10, 2025
మహిళలు టూర్లకు ఎక్కువగా ఎందుకు వెళ్లాలంటే?

ప్రపంచవ్యాప్తంగా మహిళలు ఇప్పుడు సోలోగా ట్రిప్స్ వేయడానికి ఇష్టపడుతున్నారు. ఇది మన సమాజంలో వస్తున్న ఓ పెద్ద మార్పు. మహిళలు టూర్లకు వెళ్లడం వల్ల ఎంపవర్మెంట్, ఫ్రీడమ్, పర్సనల్ గ్రోత్, ఆత్మవిశ్వాసం, మానసిక ఆరోగ్యం మెరుగవడం, కొత్త సంస్కృతుల గురించి తెలుసుకోవడం, కొత్త బంధాలు, నైపుణ్యాలు నేర్చుకోవడానికి వీలవుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మహిళలు టూర్లకు వెళ్లడం అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు.
News December 10, 2025
అభిషేక్ కోసం పాకిస్థానీలు తెగ వెతికేస్తున్నారు!

భారత బ్యాటింగ్ సెన్సేషన్ అభిషేక్ శర్మకు పాకిస్థాన్లోనూ క్రేజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఎంతలా అంటే.. తమ దేశ క్రికెటర్లు బాబర్, షాహీన్ అఫ్రీది కంటే ఎక్కువగా వెతికేంత. పాక్లో క్రికెట్ లవర్స్ గూగుల్లో ఎక్కువగా సెర్చ్ చేసింది మన అభి గురించేనని తేలింది. రెండో స్థానంలో పాక్ క్రికెటర్ నవాజ్ ఉన్నారు. ఇటీవల ఆసియా కప్లో అభిషేక్ వరుసగా 74(39), 31(13) రన్స్తో పాక్ బౌలర్లను మట్టికరిపించారు.
News December 10, 2025
H-1B వీసా అపాయింట్మెంట్స్ రీషెడ్యూల్.. అప్లికెంట్ల ఆందోళన

ఈ నెల 15 నుంచి సోషల్ మీడియా వెట్టింగ్ రూల్ అమల్లోకి రానుండటంతో భారత్లో H-1B వీసాల అపాయింట్మెంట్స్ను US రీషెడ్యూల్ చేసింది. వెట్టింగ్ పూర్తయ్యాకే అపాయింట్మెంట్స్ను నిర్వహించనుంది. వెట్టింగ్లో భాగంగా SM అకౌంట్లను చెక్ చేసి, USపై నెగటివ్ పోస్టులు చేసిన వారి వీసాలు రిజెక్ట్ చేస్తారు. దీనికి సమయం పట్టే ఛాన్స్ ఉండటంతో అప్లికెంట్లు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడే ఉంటే ఉద్యోగాలు పోతాయంటున్నారు.


