News May 4, 2024
వారికి రేపు, ఎల్లుండి పెన్షన్లు పంపిణీ

AP: రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ దాదాపుగా పూర్తయింది. అయితే బ్యాంకు అకౌంట్లు యాక్టివ్గా లేని 74,399 మందికి డీబీటీ ద్వారా నగదు జమ కాలేదు. వీరందరికీ నేరుగా నగదును పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు లబ్ధిదారుల వివరాలను పెన్షన్ యాప్ నందు అప్డేట్ చేశారు. వీరందరికీ పెన్షన్లు అందజేసే ప్రక్రియను 4, 5 తేదీల్లో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
Similar News
News November 16, 2025
3Dలోనూ అఖండ-2

బోయపాటి శ్రీను డైరెక్షన్లో బాలకృష్ణ నటిస్తోన్న అఖండ-2 సినిమాను 3Dలోనూ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఫ్యాన్స్కు కొత్త అనుభూతి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ ఫార్మాట్లోనూ తీసుకొస్తున్నట్లు బోయపాటి చెప్పారు. ‘ఈ చిత్రం దేశ ఆత్మ, పరమాత్మ. సనాతన ధర్మం ఆధారంగా మూవీని రూపొందించాం. ఈ సినిమాను దేశమంతా చూడాలనుకుంటున్నాం. అందుకే ముంబై నుంచి ప్రచారం ప్రారంభించాం’ అని పేర్కొన్నారు.
News November 16, 2025
అంబేడ్కర్ ప్రసంగం కంఠోపాఠం కావాలి: సీజేఐ

AP: రాజ్యాంగాన్ని దేశానికి అప్పగిస్తూ అంబేడ్కర్ చేసిన ప్రసంగం లాయర్లకు కంఠోపాఠం కావాలని CJI జస్టిస్ బీఆర్ గవాయ్ చెప్పారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లయిన సందర్భంగా మంగళగిరిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ‘రాజ్యాంగాన్ని అంబేడ్కర్ ఓ స్థిరపత్రంగా చూడకుండా సవరణ విధానాలనూ పొందుపరిచారు. ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే కోర్టులను ఆశ్రయించే హక్కునూ కల్పించారు’ అని పేర్కొన్నారు.
News November 16, 2025
BREAKING: భారత్ ఓటమి

సౌతాఫ్రికాతో తొలి టెస్టులో భారత్కు ఊహించని షాక్ ఎదురైంది. 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక ఓటమి పాలైంది. టీమ్ ఇండియా 93 పరుగులకే పరిమితమైంది. దీంతో RSA 30 పరుగుల తేడాతో గెలిచింది. సుందర్ 31, అక్షర్ 26, జడేజా 16 రన్స్ చేశారు. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. మెడనొప్పితో గిల్ సెకండ్ ఇన్నింగ్సులో బ్యాటింగ్కు రాలేదు. SA బౌలర్లలో హార్మర్ 4, జాన్సెన్ 3 వికెట్లతో సత్తా చాటారు.


