News July 27, 2024
బడ్జెట్పై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు: భట్టి

TG: బడ్జెట్పై బీఆర్ఎస్ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ తీసుకొచ్చినట్లు తెలిపారు. సత్యదూరమైన మాటలతో భ్రమలు కల్పించవద్దన్నారు. గత ప్రభుత్వం మద్యం దుకాణాల వేలం గడువు కన్నా ముందే ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని కొంత మంది చేతుల్లో BRS పాలకులు పెట్టారని మండిపడ్డారు.
Similar News
News October 31, 2025
నేటి ముఖ్యాంశాలు

* AP: తుఫానుతో రూ.5,265 కోట్ల నష్టం: చంద్రబాబు
* తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పవన్ పర్యటన
* 15లక్షల ఎకరాల్లో పంట నష్టం: జగన్
* TG: వరద ప్రాంతాల్లో రేపు సీఎం రేవంత్ పర్యటన
* దేశ ద్రోహానికి పాల్పడ్డ వ్యక్తి అజహరుద్దీన్: కిషన్ రెడ్డి
* ఎకరాకు రూ.10వేల చొప్పున సాయం: తుమ్మల
* సుప్రీంకోర్టు కొత్త సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్
* WWC: ఫైనల్ చేరిన టీమ్ ఇండియా
News October 31, 2025
ఎవరు గెలిచినా చరిత్రే

WWC <<18154615>>సెమీఫైనల్లో<<>> ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించిన భారత జట్టు ఫైనల్కు దూసుకెళ్లింది. సౌతాఫ్రికాతో టైటిల్ పోరుకు సిద్ధమైంది. నవి ముంబై వేదికగా నవంబర్ 2న ఫైనల్ జరగనుంది. భారత్, సౌతాఫ్రికా జట్లు ఇప్పటివరకు ఒక్కసారి కూడా వరల్డ్ కప్ గెలవలేదు. ఈసారి ఎవరు విజేతగా నిలిచినా అది ఆ జట్టుకు తొలి వరల్డ్కప్గా చరిత్రలో నిలుస్తుంది.
News October 31, 2025
సర్దార్ పటేల్ ఫ్యామిలీతో మోదీ భేటీ

భారత తొలి ఉపప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ కుటుంబ సభ్యులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. వారితో సంభాషణ, దేశానికి సర్దార్ పటేల్ చేసిన సేవలను గుర్తు చేసుకోవడం గొప్పగా ఉందని Xలో పేర్కొన్నారు. గుజరాత్లోని కేవడియాలో సర్దార్ పటేల్ 150వ జయంతి వేడుకల్లో ఆయనకు నివాళిగా స్పెషల్ కాయిన్, స్టాంప్ను మోదీ రిలీజ్ చేశారు. ఈ ప్రాంతంలోనే ప్రపంచంలోనే ఎత్తైన సర్దార్ పటేల్ విగ్రహం(182 మీటర్లు) ఉంది.


