News April 2, 2024

వైసీపీ పాలనలో ప్రజల్లో సంతోషం: వైవీ సుబ్బారెడ్డి

image

AP: వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని ఆ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. పార్వతీపురం ‘మేమంతా సిద్ధం’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘ప్రతి ఒక్కరికీ విద్యా, వైద్యం అందించాం. అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేశాం. ఈ సంక్షేమం గ్రామాల్లో కొనసాగాలంటే జగన్‌ మళ్లీ ముఖ్యమంత్రి కావాలి. ప్రజలను చైతన్యవంతులను చేసి వైసీపీకి ఓటు వేయించండి.’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News November 6, 2025

BBL: ఆ బంతులు ప్రేక్షకులకే!

image

ఆస్ట్రేలియాలో జరిగే BBL, WBBL టోర్నీల్లో కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. బ్యాటర్ 6 లేదా 4 కొట్టిన బంతి ప్రేక్షకుల వద్దకు వెళితే దాన్ని వాళ్లు తీసుకెళ్లొచ్చు. అయితే ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్‌కే ఇది వర్తిస్తుంది. ఆ ఓవర్‌లో ఎన్నిసార్లు కొట్టినా సరే బంతిని మారుస్తారు. మరోవైపు బాల్‌ను ప్రేక్షకులు తీసుకోకపోయినా రెండో ఓవర్ నుంచి కొత్తది వాడనున్నారు. ఆలస్యం జరగకుండా అంపైర్లు తమ వద్ద కొన్ని ఉంచుకోనున్నారు.

News November 6, 2025

IMMTలో 30 ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడిగింపు

image

CSIR-ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ(<>IMMT<<>>)లో 30 పోస్టులకు అప్లై చేయడానికి దరఖాస్తు గడువును పొడిగించింది. అర్హతగల అభ్యర్థులు NOV 21 వరకు అప్లై చేసుకోవచ్చు. సైంటిస్ట్, Sr సైంటిస్ట్, ప్రిన్సిపల్ సైంటిస్ట్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ME, ఎంటెక్, BE, బీటెక్ , PhD ఉత్తీర్ణులైనవారు అర్హులు. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.immt.res.in/

News November 6, 2025

కోయంబత్తూరు గ్యాంగ్ రేప్ కేసు.. ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

image

కోయంబత్తూరు <<18187183>>గ్యాంగ్ రేప్<<>> బాధితురాలిపై DMK మిత్రపక్ష MLA ఈశ్వరన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాత్రి 11.30గం.కు మహిళ, పురుషుడు చీకట్లో ఉండటం వల్ల కలిగే అనర్థాలను ఆపేదెలాగని అన్నారు. వీటిని పోలీసులు, ప్రభుత్వం అడ్డుకోలేవని చెప్పారు. పేరెంట్స్ పెంపకం, టీచర్లతోనే మార్పు వస్తుందని పేర్కొన్నారు. దీంతో నిందితులను ఒక్కమాట అనకుండా బాధితురాలిని తప్పుబట్టడమేంటని BJP నేత అన్నామలై మండిపడ్డారు.