News April 2, 2024
వైసీపీ పాలనలో ప్రజల్లో సంతోషం: వైవీ సుబ్బారెడ్డి
AP: వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని ఆ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. పార్వతీపురం ‘మేమంతా సిద్ధం’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘ప్రతి ఒక్కరికీ విద్యా, వైద్యం అందించాం. అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేశాం. ఈ సంక్షేమం గ్రామాల్లో కొనసాగాలంటే జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలి. ప్రజలను చైతన్యవంతులను చేసి వైసీపీకి ఓటు వేయించండి.’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News October 7, 2024
అల్పపీడనం ఎఫెక్ట్.. రేపు భారీ వర్షాలు
ఏపీలో అల్పపీడన ప్రభావంతో ఇవాళ పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, ఏలూరు, ప్రకాశం, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుసే ఛాన్స్ ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. తెలంగాణలో రెండు రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది.
News October 7, 2024
ఇజ్రాయెల్, హమాస్ యుద్ధానికి ఏడాది
ఇజ్రాయెల్, హమాస్ యుద్ధానికి ఏడాది పూర్తి అయింది. 2023, అక్టోబర్ 7న హమాస్ టెర్రరిస్టులు ఇజ్రాయెల్లోకి చొరబడి విధ్వంసం సృష్టించారు. పిల్లలు, యువతుల్ని బందీలుగా తీసుకెళ్లడంతో పాలస్తీనాలో IDF ఏరివేత మొదలు పెట్టింది. దీంతో లక్షలాది ప్రజలు నిరాశ్రయులు అయ్యారు. మధ్యలో బందీలను ఎక్స్ఛేంజ్ చేసుకున్నా హెజ్బొల్లా దూరడంతో వివాదం మరో టర్న్ తీసుకుంది. ఇప్పుడు ఇరాన్తో ప్రత్యక్ష యుద్ధం స్థాయికి చేరింది.
News October 7, 2024
జగన్ పుంగనూరు పర్యటన రద్దు: పెద్దిరెడ్డి
AP: వైసీపీ అధినేత వైఎస్ జగన్ పుంగనూరు పర్యటన రద్దయినట్లు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. హత్యకు గురైన ఆరేళ్ల చిన్నారి కుటుంబాన్ని ఎల్లుండి పరామర్శించాల్సి ఉండగా అనివార్య కారణాలతో రద్దు చేసుకున్నట్లు చెప్పారు. జగన్ పర్యటిస్తారనే భయంతోనే ముగ్గురు మంత్రులు ఆఘమేఘాల మీద ఇక్కడికొచ్చారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇలాంటి ఘటనల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.