News April 2, 2024
వైసీపీ పాలనలో ప్రజల్లో సంతోషం: వైవీ సుబ్బారెడ్డి

AP: వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని ఆ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. పార్వతీపురం ‘మేమంతా సిద్ధం’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘ప్రతి ఒక్కరికీ విద్యా, వైద్యం అందించాం. అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేశాం. ఈ సంక్షేమం గ్రామాల్లో కొనసాగాలంటే జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలి. ప్రజలను చైతన్యవంతులను చేసి వైసీపీకి ఓటు వేయించండి.’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News September 19, 2025
శుభ సమయం (19-09-2025) శుక్రవారం

✒ తిథి: బహుళ త్రయోదశి రా.11.51 వరకు
✒ నక్షత్రం: ఆశ్లేష ఉ.8.49 వరకు
✒ శుభ సమయములు: ఉ.10.08-ఉ.10.38, సా.5.45-సా.6.10
✒ రాహుకాలం: మ.10.30-మ.12.00
✒ యమగండం: మ.12.24-మ.1.12
✒ దుర్ముహూర్తం: ఉ.8.24.00-ఉ.9.12, మ.12.24-మ.1.12
✒ వర్జ్యం: రా.8.57-రా.10.33
✒ అమృత ఘడియలు: ఉ.7.12-ఉ.8.46
News September 19, 2025
టుడే టాప్ స్టోరీస్

* జీఎస్టీ సంస్కరణలతో పేదల జీవితాలు మారతాయి: CM చంద్రబాబు
* ఢిల్లీకి సీఎం రేవంత్.. పెట్టుబడులపై కంపెనీల ప్రతినిధులతో రేపు భేటీ
* ప్రజల గొంతు వినాలని ప్రభుత్వానికి లేదు: జగన్
* నకిలీ ఓట్ల వెనుక ఎవరున్నారో తెలియాలి: రాహుల్ గాంధీ
* ఓట్ల చోరీ ఆరోపణలు చేయడం రాహుల్కు అలవాటుగా మారింది: BJP
* OCT 1 నుంచి అమల్లోకి ఆన్లైన్ గేమింగ్ చట్టం: కేంద్రం
* లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
News September 19, 2025
బగ్రామ్ ఎయిర్బేస్ స్వాధీనం చేసుకోవాలి: ట్రంప్

అఫ్గానిస్థాన్లోని బగ్రామ్ ఎయిర్బేస్ను తిరిగి స్వాధీనం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. గత ప్రెసిడెంట్ జోబైడెన్ ఎలాంటి ప్రయోజనం లేకుండానే ఆ స్థావరాన్ని వదిలేశారని విమర్శించారు. చైనా అణ్వాయుధ ఉత్పత్తి కేంద్రాల నుంచి కేవలం గంటలోనే ఈ ఎయిర్బేస్కు చేరుకోవచ్చని తెలిపారు. భవిష్యత్తులో చైనా ఈ స్థావరాన్ని చేజిక్కించుకుంటుందన్న అనుమానంతోనే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.