News October 18, 2024

జగన్ రాక్షస పాలనను ప్రజలు మర్చిపోలేరు: మంత్రి అనగాని

image

AP: టీడీపీ కార్యాలయంపై దాడి జరిగి రేపటితో మూడేళ్లు పూర్తవుతుందని, తప్పుచేసిన వారు శిక్ష నుంచి తప్పించుకోలేరని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. జగన్ రాక్షస పాలనను ప్రజలు మర్చిపోలేరన్నారు. దెబ్బతిన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు సీఎం చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. టీడీపీ నేతలు దోపిడీకి పాల్పడకూడదన్నదే ఆయన ఉద్దేశమని పేర్కొన్నారు.

Similar News

News November 28, 2025

రాజన్న ఆలయంలో అద్దాల మండపం తొలగింపు పూర్తి

image

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర క్షేత్రంలో అద్దాల మండపం (స్వామివారి కళ్యాణమండపం) తొలగింపు పూర్తయింది. ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులలో భాగంగా ఆలయ పరిసరాల్లో ఫ్లోరింగ్ పూర్తిగా తొలగించారు. అద్దాల మండపం తొలగించి శిథిలాలు తరలించారు. ఉత్తరం వైపు ప్రాకారం పూర్తిగా తీసివేయడంతో పాటు బాల రాజేశ్వర ఆలయ సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయాన్ని తొలగించారు. ధర్మగుండం రెండు వైపులా ప్రాకారం కూల్చివేశారు.

News November 28, 2025

ఇతిహాసాలు క్విజ్ – 80 సమాధానాలు

image

ప్రశ్న: ఉప పాండవులను ఎవరు, ఎందుకు చంపారు?
సమాధానం: ఉప పాండవులను చంపింది అశ్వత్థామ. కురుక్షేత్రంలో తన తండ్రి ద్రోణాచార్యుడి మరణానికి ప్రతీకారంగా, ఆయనను అన్యాయంగా చంపారని భావించి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. యుద్ధ రీతిని వీడి, నైతికతను మరచి నిద్రిస్తున్న పాండవుల కుమారులను పాండవులుగా భ్రమించి దారుణంగా చంపాడు. కౌరవ సేనాపతిగా చనిపోతున్న దుర్యోధనుడికిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు.
<<-se>>#Ithihasaluquiz<<>>

News November 28, 2025

14 ఏళ్లకే ప్రేమ, జంప్.. ఎందుకిలా?

image

విజయవాడకు చెందిన బాలిక(14), బాలుడు(13) ఇంటి నుంచి పారిపోవడంపై నెటిజన్లు షాకవుతున్నారు. అంతచిన్న వయసులో ఇలాంటి ఆలోచన, ధైర్యం రావడమేంటని కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలు, సోషల్ మీడియా వల్లే ఇలా జరుగుతోందంటున్నారు. బుధవారం బాలుడు తన తండ్రి ఫోన్, రూ.10వేలు తీసుకుని అమ్మాయితో హైదరాబాద్ వచ్చాడు. తుక్కుగూడలో రూమ్ కోసం వెతుకుతుండగా ఆటో డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు పేరెంట్స్‌కు అప్పగించారు.