News October 18, 2024

జగన్ రాక్షస పాలనను ప్రజలు మర్చిపోలేరు: మంత్రి అనగాని

image

AP: టీడీపీ కార్యాలయంపై దాడి జరిగి రేపటితో మూడేళ్లు పూర్తవుతుందని, తప్పుచేసిన వారు శిక్ష నుంచి తప్పించుకోలేరని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. జగన్ రాక్షస పాలనను ప్రజలు మర్చిపోలేరన్నారు. దెబ్బతిన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు సీఎం చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. టీడీపీ నేతలు దోపిడీకి పాల్పడకూడదన్నదే ఆయన ఉద్దేశమని పేర్కొన్నారు.

Similar News

News November 11, 2025

ఇతిహాసాలు క్విజ్ – 63

image

ఈరోజు ప్రశ్న: సూర్యపుత్రుడు అయిన కర్ణుడిని గురువైన పరశురాముడు ఎందుకు శపించాడు? ఏమని శపించాడు?
☛ పై ప్రశ్నకు సమాధానాన్ని సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు జవాబు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>

News November 11, 2025

నార్త్ ఈస్టర్న్ రైల్వేలో 1104 పోస్టులు.. అప్లై చేశారా?

image

నార్త్ ఈస్టర్న్ రైల్వేలో 1104 అప్రెంటిస్‌ల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. టెన్త్, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు ఈ నెల 15వరకు అప్లై చేసుకోవచ్చు. అప్రెంటిస్‌ల వయసు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గల అభ్యర్థులకు ఏజ్‌లో సడలింపు ఉంది. ప్రాసెసింగ్ ఫీజు రూ.100. ST,SC, దివ్యాంగులకు మినహాయింపు కలదు. https://ner.indianrailways.gov.in/

News November 11, 2025

పోలింగ్ ప్రారంభం

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. నియోజకవర్గ వ్యాప్తంగా 407 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. జూబ్లీహిల్స్‌లో మొత్తం 4,01,365 మంది ఓటర్లున్నారు. సా.6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఓటింగ్ స్టేషన్ల వద్ద 2,060 మంది పోలీసులు, CRPF సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అటు బిహార్‌లో చివరి విడతగా 122 స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది.