News October 4, 2024
జగన్ చెప్పేది ప్రజలు వినరు: పయ్యావుల
AP: సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మాజీ సీఎం వైఎస్ జగన్ వక్రీకరించారని మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. ఆయన మాటలను నమ్మే స్థితిలో ప్రజలు లేరని చెప్పారు. ‘వైసీపీ పాలనలో తిరుమల అపవిత్రమైంది. శ్రీవారిని నమ్ముతున్నానని జగన్ ఒక్క మాట కూడా అనలేదు. ఎంతసేపూ లడ్డూ ప్రసాదం గురించే మాట్లాడుతున్నారు. కోర్టు ఆర్డర్ రాకముందే జగన్ ప్రెస్మీట్లో మాట్లాడారు. దోషులు ఎవరనేది విచారణలో తేలుతుంది’ అని ఆయన ఫైర్ అయ్యారు.
Similar News
News October 7, 2024
పాత ఉద్యోగికి రూ.23వేల కోట్ల ఆఫర్ ఇచ్చిన గూగుల్
ఓల్డ్ ఎంప్లాయీని తిరిగి తీసుకొచ్చేందుకు గూగుల్ ఇచ్చిన ఆఫర్ చర్చనీయాంశంగా మారింది. AI ఎక్స్పర్ట్ నోవమ్ షాజీర్కు ఏకంగా రూ.23000 కోట్లు ఆఫర్ చేసింది. 2000లో జాయిన్ అయిన నోవమ్ తన MEENA చాట్బోట్ను మార్కెట్లోకి తీసుకురాలేదని రెండేళ్ల క్రితం వెళ్లిపోయారు. సొంతంగా Character.AIను నెలకొల్పారు. అది ఆర్థిక కష్టాల్లో పడటంతో గూగుల్ ఈ ఆఫర్ ఇచ్చింది. తమ AI ప్రాజెక్ట్ జెమినీకి VPని చేసింది.
News October 7, 2024
సింగర్ అద్నాన్ సమీ తల్లి కన్నుమూత
ప్రముఖ సింగర్ అద్నాన్ సమీ తల్లి బేగమ్ నౌరీన్ సమీ ఖాన్(77) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు. ‘అమ్మ మరణించడం మాకు తీరని లోటు. ఆమె ఒక అద్భుతమైన మహిళ. ఎంతో ప్రేమ, ఆనందాన్ని అందరితోనూ పంచుకునేవారు’ అని రాసుకొచ్చారు. ఈయన హిందీ, తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లోనూ వందలాది సూపర్ హిట్ సాంగ్స్ పాడారు. పలు చిత్రాలకు మ్యూజిక్ కూడా అందించారు.
News October 7, 2024
విమానంలో అడల్ట్ మూవీ.. షాకైన ప్యాసింజర్స్
ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుంచి జపాన్లోని హనెడాకు వెళుతున్న క్వాంటస్ విమానంలోని అన్ని స్క్రీన్లలో ఒక్కసారిగా అడల్ట్ మూవీ ప్లే అయ్యింది. మూవీ తమ స్క్రీన్లపై ప్రసారం కాగా దాన్ని ఆపేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అయితే సాంకేతిక సమస్య వల్ల ఇలా జరిగినట్లు పేర్కొన్న ఎయిర్లైన్స్, ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది.