News March 31, 2024

కేసీఆర్‌ను జనం నమ్మే పరిస్థితి లేదు: అద్దంకి

image

TG: బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌ను నమ్మే పరిస్థితిలో జనం లేరని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు. అసెంబ్లీకి కూడా రాని KCR రాజకీయ లబ్ధి కోసమే పొలం బాట పట్టారని విమర్శించారు. కేసీఆర్‌ను ప్రజలు ఎప్పుడో మరిచిపోయారని.. ఆయన మొసలి కన్నీరును ఎవరూ పట్టించుకోరని అన్నారు.

Similar News

News October 6, 2024

World Bankకు సలహాలిచ్చే స్థాయికి భారత్: ఫేమస్ ఎకానమిస్ట్

image

సలహాలు తీసుకోవడం మానేసి ప్రపంచ బ్యాంకుకే సలహాలు ఇచ్చే స్థితికి భారత్ చేరిందని ఎకానమిస్ట్ జగదీశ్ భగవతి అన్నారు. ‘మనమిప్పుడు సరికొత్త యుగానికి చేరాం. నాయకత్వమే కీలకం. గతంలో పాలసీలు, ప్రొడక్షన్ క్వాలిటీ పరంగా దేశం వెనకబడే ఉండేది. కరెక్ట్ టైమ్‌లో మోదీ PM కావడం అదృష్టం. వ్యవస్థలు మారాలని ఆయన ముందు నుంచే చెప్తున్నారు. కేంబ్రిడ్జ్ సహా మేధావులకు లేని కన్విక్షన్ ఆయన సొంతం. అందుకే ఆయనిష్టం’ అని చెప్పారు.

News October 6, 2024

JK: పాక్ ఆయుధాలు, బాంబుల్ని సీజ్ చేసిన ఆర్మీ

image

JK పూంఛ్ జిల్లాలోని జుల్లాస్ ఏరియాలో డేంజరస్ ఆయుధాలు, పేలుడు పదార్థాలు దొరికాయి. నమ్మదగిన వారి సమాచారంతో భారత సైన్యం రోమియోఫోర్స్ శనివారం రాత్రి సెర్చ్ ఆపరేషన్ ఆరంభించింది. అనుమానిత టెర్రరిస్టు బ్యాగును స్వాధీనం చేసుకుంది. ఇందులో AK 47, పాకిస్థానీ పిస్టల్, RCIED, టైమ్ బాంబులు, స్టవ్ IED, IED పరికరాలు, చైనీస్ గ్రెనేడ్లు ఉన్నాయి. ఇవన్నీ రెడీ టు యూజ్ మోడ్‌లో ఉన్నాయి. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

News October 6, 2024

ENCOUNTER: మృతుల్లో 13 మంది మహిళలు

image

ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మొత్తం 31 మంది మావోయిస్టులు మరణించగా, అందులో 13 మంది మహిళలు ఉన్నారని బస్తర్ ఐజీ సుందర్ రాజన్ వెల్లడించారు. మృతులంతా ఇంద్రావతి ఏరియా కమిటీ PLGA 6 బెటాలియన్ సభ్యులని తెలిపారు. అందులో దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ తూర్పు బస్తర్ ఇన్‌ఛార్జ్ నీతి అలియాస్ ఊర్మిళ కూడా ఉన్నారని, ఆమెపై రూ.25 లక్షల రివార్డు ఉందని పేర్కొన్నారు.