News November 9, 2024
ప్రజలు కేసీఆర్ను మర్చిపోయారు: బండి

TG: ప్రజలు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ను ఎప్పుడో మర్చిపోయారని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకునే వారిని తెలంగాణ సమాజం నాయకుడిగా భావించబోదని అన్నారు. మహారాష్ట్రలో రేవంత్ అబద్ధాలు చెప్పారని దుయ్యబట్టారు. మరోవైపు నక్సలిజం భావాలున్న వారికి విద్యాకమిషన్లో చోటు కల్పిస్తారా అని ప్రశ్నించారు. వెంటనే విద్యాకమిషన్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
Similar News
News November 4, 2025
వృద్ధాప్యంలో ఆదుకొనేలా కేరళలో ‘టైమ్ బ్యాంకు’

వృద్ధాప్యంలో ఆదుకొనేలా కేరళలోని కొట్టాయం(D) ఎలికుళం పంచాయతీ ‘టైమ్ బ్యాంక్’ అనే పద్ధతిని అమల్లోకి తెచ్చింది. ముందుగా యువత అక్కడి ఆఫీసులో నమోదవ్వాలి. స్థానిక వృద్ధులకు తోడుగా ఉంటూ సాయం చేయాలి. వారు సేవ చేసిన సమయం ఆ టైమ్ బ్యాంకులో జమ అవుతుంది. వారికి అవసరమైనప్పుడు ఆ పాయింట్ల ద్వారా సేవలు పొందొచ్చు. వలసలతో వృద్ధులు ఒంటరి వారవుతుండడంతో జపాన్ స్ఫూర్తితో దీన్ని అనుసరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
News November 4, 2025
మీర్జాగూడ ప్రమాదానికి టిప్పర్ అతివేగమే కారణం: DGP

TG: మీర్జాగూడ బస్సు ప్రమాదానికి టిప్పర్ అతివేగమే కారణమని DGP శివధర్ రెడ్డి తెలిపారు. ప్రమాద స్థలాన్ని ఇవాళ ఆయన పరిశీలించారు. ‘ఇక్కడ రోడ్డు మలుపు ఉంది కానీ యాక్సిడెంట్ అయ్యేంత తీవ్ర మలుపు లేదు. దర్యాప్తులో అన్ని విషయాలు వెల్లడవుతాయి. టిప్పర్ కండిషన్ను పరిశీలిస్తున్నాం. రోడ్డు ప్రమాదాలను ప్రభుత్వ పరంగా చూడకూడదు. అందరి బాధ్యతగా చూడాలి. డ్రైవర్లు డిఫెన్స్ కండిషన్ను అంచనా వేసుకోవాలి’ అని సూచించారు.
News November 4, 2025
ఇళ్లకు సమీపంలో చెట్లు ఉండకూడదా?

మర్రి, రావి, వేప వంటి పెద్ద వృక్షాలను ఇళ్లకు అతి సమీపంలో పెంచడం మంచిది కాదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచించారు. ఈ చెట్ల వేర్లు బలంగా విస్తరించి ఇంటి పునాదులను దెబ్బ తీసే అవకాశాలుంటాయని అన్నారు. ‘ఇది నిర్మాణానికి హాని కలిగిస్తుంది. వాస్తుపరంగా స్థిరత్వాన్ని తగ్గిస్తుంది. ఇంటి గోడలకు నష్టం కలగకుండా, గృహ నిర్మాణం ఆయుష్షు పెరగడానికి, ఈ చెట్లను కొంత దూరంలో పెంచడం శుభకరం’ అని పేర్కొన్నారు. <<-se>>#Vasthu<<>>


