News April 27, 2024
ప్రజలు, మేధావులు ఆలోచించాలి: KCR

TG: రాష్ట్రంలో చాలా చిత్రవిచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయని మాజీ సీఎం KCR Xలో పోస్ట్ చేశారు. ‘మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో నేను భోజనం చేస్తున్నప్పుడు 2 సార్లు కరెంట్ పోయింది. కరెంట్ పోవడం లేదని CM, డిప్యూటీ CMలు ఊదరగొడుతున్నారు. రోజుకు 10సార్లు కరెంట్ పోతోందని మా నేతలు నాకు చెప్పారు. కాంగ్రెస్ వైఫల్యానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏముంటుంది? ప్రజలు, మేధావులు ఆలోచించాలి’ అని KCR పోస్ట్ చేశారు.
Similar News
News January 15, 2026
ఫోన్ ఎత్తుకెళ్లిన బెంగాల్ సీఎం.. సుప్రీంకోర్టులో ఈడీ

వెస్ట్ బెంగాల్ ఐప్యాక్ కార్యాలయంలో ఈడీ సోదాలపై సుప్రీంకోర్టులో వాడీవేడీగా విచారణ జరిగింది. సోదాల సమయంలో WB సీఎం మమతా తమ ఫోన్ను ఎత్తుకెళ్లినట్లు ఈడీ అధికారులు SCకి తెలియజేశారు. మనీలాండరింగ్ విషయమై సోదాల గురించి ముందే స్థానిక PSకు సమాచారమిచ్చినా పోలీసులతో మమతా తమ సోదాలకు అంతరాయం కలిగించారన్నారు. అటు పోలీసులను మమత నియంత్రించడం తీవ్రమైన అంశంగా సుప్రీంకోర్టు పరిగణించింది.
News January 15, 2026
పొద్దుతిరుగుడు నాటిన తర్వాత కలుపు నివారణ

పొద్దుతిరుగుడు విత్తిన 24-48 గంటల్లోపు ఎకరాకు 200 లీటర్ల నీటిలో 1 లీటర్ పెండిమిథాలిన్30% E.C రసాయనాన్ని కలిపి పిచికారీ చేయాలి. దీని వల్ల 20 రోజుల వరకు కలుపును నివారించవచ్చు. పంట 30-40 రోజుల దశలో అంతరకృషి చేయాలి. ఇది సాధ్యం కాకపోతే గడ్డి జాతి కలుపు నివారణకు ఎకరాకు 400ml క్విజాలొఫాప్ ఇథైల్ 5% ఇ.సి. లేదా ప్రొపాక్విజాఫాప్ 10% ఇ.సి. 250mlను 200 లీటర్ల నీటిలో కలిపి కలుపు 2-4 ఆకుల దశలో పిచికారీ చేయాలి.
News January 15, 2026
ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్లో ఉద్యోగాలు… అప్లై చేశారా?

<


