News January 29, 2025

చంద్రబాబు కుట్రలు ప్రజలకు తెలుసు: పెద్దిరెడ్డి

image

AP: తాము 2001లో కొనుగోలు చేసిన భూములకు రెవెన్యూ శాఖ సర్వే చేసిందని, వాటిని ఇప్పుడు అటవీ భూములు అంటున్నారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు ప్రజలకు తెలుసని విమర్శించారు. అలాగే, ఎంతమంది YCP నుంచి వెళ్లినా పార్టీకి ఏం కాదన్నారు. VSR రాజీనామా ఆయన వ్యక్తిగతం అని చెప్పారు. పెద్దిరెడ్డి భూములపై ఆరోపణలు రాగా ప్రభుత్వం విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.

Similar News

News November 20, 2025

బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ టర్మ్స్

image

బిహార్ రాజకీయ భీష్ముడిగా పేరొందిన నితీశ్ ఇవాళ 10వ సారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఆయన తొలిసారి 2000 సం.లో సీఎం అయ్యారు. అప్పటి నుంచి బీజేపీ, ఆర్జేడీ, కాంగ్రెస్, లోక్ జన్‌శక్తి.. ఇలా ఎన్నో పార్టీలతో కలిసి సీఎం పీఠాన్ని అధిరోహించారు.
*2000 మార్చి 3- 2000 మార్చి 7 *2005-2010
*2010-2014 *2015 FEB 22- 2015 NOV 19 *2015-2017 *2017-2020 *2020-2022 *2022-24 *2024-2025 NOV.

News November 20, 2025

542 ఉద్యోగాలు.. దరఖాస్తు చేశారా?

image

బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(BRO)లో 542 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 24లోపు అప్లై చేసుకుని దరఖాస్తును స్పీడ్ పోస్టులో పంపాలి. వెహికల్ మెకానిక్, MSW పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి టెన్త్, ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. రాతపరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, PET, ట్రేడ్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://bro.gov.in/

News November 20, 2025

ఫస్ట్ వింగ్‌కమాండర్ డా.విజయలక్ష్మి రమణన్‌

image

భారత వైమానిక దళ మొదటి వింగ్ కమాండర్ డాక్టర్ విజయలక్ష్మి రమణన్‌. 1924లో జన్మించిన ఆమె మద్రాస్ మెడికల్ కాలేజీలో చదువుకుని చెన్నైలోని ఎగ్మోర్ ఆసుపత్రిలో సేవలందించారు. 1955లో ఆర్మీ మెడికల్ కార్ప్స్‌లో చేరి గైనకాలజిస్ట్‌గా, తొలి మహిళా అధికారిణిగా నియమితులయ్యారు. 1962, 1966, 1971 యుద్ధాల్లో గాయపడిన సైనికులకు ఆమె చికిత్స అందించారు. 1977లో విశిష్ట సేవా అవార్డును అందుకున్న ఆమె 1979లో పదవీ విరమణ చేశారు.