News September 19, 2024
వరదల తర్వాత అమరావతిపై ప్రజలకు నమ్మకం పోయింది: VSR

AP: విజయవాడ వరదల తర్వాత రాజధాని అమరావతిపై ప్రజలకు నమ్మకం పోయిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. బుడమేరు వరదలు, అమరావతి భవిష్యత్పై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ‘ఒకరి కల కోసం రాష్ట్రానికి కోట్లు ఖర్చు చేసే స్థోమత లేదు. పెట్టుబడి దారుల విశ్వాసం సన్నగిల్లింది. అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ సాహసించడం లేదు’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News December 8, 2025
TG గ్లోబల్ సమ్మిట్.. మంత్రులు ఏమన్నారంటే?

* ఫీనిక్స్ పక్షి మాదిరిగా వివిధ రంగాల్లో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్గా TGని మారుస్తాం: శ్రీధర్ బాబు
* రాష్ట్రాన్ని ప్రపంచ విద్యాకేంద్రంగా తీర్చిదిద్దుతాం: రాజనర్సింహ
* పర్యావరణం, ప్రజారోగ్యం, ఇంధన భద్రత కోసం క్లీన్ మొబిలిటీకి ప్రాధాన్యం: పొన్నం
* పర్యాటక రంగాన్ని సరికొత్తగా ప్రపంచానికి పరిచయం చేస్తాం: జూపల్లి
* 2047నాటికి మహిళా శ్రామిక భాగస్వామ్యాన్ని 90శాతానికి పెంచడమే లక్ష్యం: సీతక్క
News December 8, 2025
విదేశాల్లో వాస్తు పాటిస్తారా?

‘వాస్తు నియమాలు నిర్ధిష్ట ప్రాంతానికి పరిమితం కాదు. ప్రపంచంలో ఎక్కడ నివసించినా, వ్యక్తిగత అలవాట్లు వేర్వేరుగా ఉన్నా, పంచభూతాల నియమాలు ఎవరూ విస్మరించలేరు. ప్రపంచంలో వాస్తు సూత్రాలను నిర్లక్ష్యం చేస్తే అది జీవన మనుగడకే ముప్పుగా మారొచ్చు. వాస్తును ప్రాంతాల వారీగా విభజించడం, ఓ ప్రాంతానికే పరిమితం చేయడం అపోహ మాత్రమే. ఈ నియమాలు విశ్వమంతటా పాటించదగినవి’ అని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు.
News December 8, 2025
గ్లోబల్ సమ్మిట్.. తొలిరోజు పెట్టుబడుల వెల్లువ

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో తొలిరోజు పెట్టుబడులు వెల్లువెత్తాయి. రూ.1.88 లక్షల కోట్లకు సంబంధించిన 35 ఒప్పందాలు కుదిరాయి. రంగాల వారీగా ఆ వివరాలు ఇలా..
* డీప్ టెక్, ఫ్యూచర్ సిటీ&కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్- రూ.1,04,000 కోట్లు
* రెన్యూవబుల్ ఎనర్జీ&పవర్ సెక్యూరిటీ- రూ.39,700 కోట్లు
* ఏరోస్పేస్, డిఫెన్స్, లాజిస్టిక్స్- రూ.19,350 కోట్లు
* అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ – రూ.13,500 కోట్లు


