News March 16, 2024

నాగర్‌కర్నూల్ ప్రజలు బీజేపీని గెలిపించాలి: మోదీ

image

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా NGKLలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎన్నికలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కూడా బీజేపీ గాలి వీస్తోందన్నారు. నాగర్‌కర్నూల్ ప్రజలు ఈసారి బీజేపీని గెలిపించాలని కోరారు. నిన్న మల్కాజ్ గిరిలో రోడ్ షో బ్రహ్మాండంగా జరిగిందన్నారు. ప్రజలు వీధుల్లో బారులు తీరి బీజేపీకి మద్దతు తెలిపారన్నారు. BRS పట్ల కోపాన్ని ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో చూపారన్నారు.

Similar News

News August 20, 2025

MBNR: భరోసా సెంటర్లదే కీలకపాత్ర: ఇందిర

image

మహబూబ్‌నగర్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో జిల్లా పోలీసు కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్‌లో భరోసా కన్వర్జెన్సీ సమావేశం నిర్వహించారు. జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ అధికారిణి ఇందిర ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భరోసా సెంటర్లు మహిళలు, చిన్నారులు, వృద్ధులు వంటి బలహీన వర్గాల రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ జరీనా, DM&HO కృష్ణ, అదనపు ఎస్పీ బి.ఎన్.రత్నం పాల్గొన్నారు.

News August 20, 2025

మహమ్మదాబాద్‌లో అత్యధిక వర్షపాతం నమోదు!

image

మహబూబ్ నగర్ జిల్లాల్లో గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా మహమ్మదాబాద్‌లో 34.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. మూసాపేట మండలం జానంపేట, జడ్చర్ల 30.0, నవాబుపేట 26.5, మహబూబ్ నగర్ అర్బన్ 24.3, హన్వాడ 23.8, భూత్పూర్, దేవరకద్ర 21.3, మిడ్జిల్ 13.5, గండీడ్ మండలం సల్కర్ పేట, చిన్న చింతకుంట 13.3, కౌకుంట్ల 11.3, బాలానగర్‌లో 5.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News August 19, 2025

MBNR: ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వద్దు.. మట్టి వినాయకులే ముద్దు

image

నీటిని కలుషితం చేసి జలచరాలకు హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ పారిస్(POP) విగ్రహాలకు బదులుగా.. మట్టి వినాయకులే ప్రతిష్ఠించేందుకు ఉమ్మడి పాలమూరు జిల్లాలో పలువురు సిద్ధమయ్యారు. ఈనెల 27 నుంచి వినాయక చవితి ప్రారంభం కానుంది. వినాయక మండపాలను సిద్ధం చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు. రోజురోజుకు పర్యావరణాన్ని కాపాడేందుకు మట్టి గణపతి విగ్రహాలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. మరి మీరేమంటారు. కామెంట్?