News August 31, 2024
ఆ ప్రాంతాల ప్రజలు బయటకు రావొద్దు: లోకేశ్

AP: వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు బయటకు రావొద్దని మంత్రి నారా లోకేశ్ సూచించారు. కొండచరియలు విరిగిపడే, లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని ఆయన ట్వీట్ చేశారు. ‘ప్రభుత్వ, విపత్తు నిర్వహణ శాఖ పంపే అలర్ట్ మెసేజ్లను గమనిస్తూ రక్షణ చర్యలు తీసుకోవాలి. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలి. టీడీపీ నేతలు, కార్యకర్తలు బాధితులకు సహాయం అందించాలి’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News December 30, 2025
రాత్రికిరాత్రే ఢాకాకు బంగ్లా రాయబారి.. ఏం జరుగుతోంది?

భారత్లోని బంగ్లాదేశ్ హైకమిషనర్ రియాజ్ హమీదుల్లా ఢాకా నుంచి వచ్చిన అత్యవసర ఆదేశాలతో సోమవారం రాత్రి హుటాహుటిన స్వదేశానికి చేరుకున్నారు. ఉస్మాన్ హాదీ హత్య నేపథ్యంలో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు పెరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుత వివాదాస్పద పరిస్థితులపై చర్చించేందుకే విదేశాంగ శాఖ ఆయన్ను పిలిపించినట్లు ‘ప్రథమ్ ఆలో’ పత్రిక వెల్లడించింది. ఈ ఆకస్మిక పరిణామం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
News December 30, 2025
థైరాయిడ్ టాబ్లెట్స్ వేసుకున్నాక ఎప్పుడు ఫుడ్ తీసుకోవాలంటే?

థైరాయిడ్ మందులను ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆ తర్వాత యాభై నిమిషాల తర్వాత ఫుడ్ తీసుకోవాలని చెబుతున్నారు. అప్పుడే శరీరం మందును బాగా గ్రహిస్తుంది. అలాగే థైరాయిడ్ టాబ్లెట్లు వేసుకున్న గంట వరకు థైరాయిడ్ మందుల శోషణకు అంతరాయం కలిగించే యాంటాసిడ్లు, ఇతర మందులను వేసుకోవడం, ఫైబర్, కాల్షియం, ఐరన్ అధికంగా ఉండే ఆహారాలు తినడం మానుకోవాలని సూచిస్తున్నారు.
News December 30, 2025
451 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

త్రివిధ దళాల్లో 451 ఆఫీసర్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. UPSC కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2026 ద్వారా వీటిని భర్తీ చేయనుంది. ఇంజినీరింగ్ డిగ్రీ, డిగ్రీ ఉత్తీర్ణులై, 20 -24ఏళ్ల మధ్య వయసు గలవారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.200, SC, ST, మహిళలకు ఫీజు లేదు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://upsconline.nic.in.


