News August 31, 2024
ఆ ప్రాంతాల ప్రజలు బయటకు రావొద్దు: లోకేశ్
AP: వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు బయటకు రావొద్దని మంత్రి నారా లోకేశ్ సూచించారు. కొండచరియలు విరిగిపడే, లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని ఆయన ట్వీట్ చేశారు. ‘ప్రభుత్వ, విపత్తు నిర్వహణ శాఖ పంపే అలర్ట్ మెసేజ్లను గమనిస్తూ రక్షణ చర్యలు తీసుకోవాలి. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలి. టీడీపీ నేతలు, కార్యకర్తలు బాధితులకు సహాయం అందించాలి’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News February 1, 2025
ట్రంప్పై దర్యాప్తు చేసినవారి మెడపై సస్పెన్షన్ కత్తి
US అధ్యక్షుడు ట్రంప్పై క్రిమినల్ నేరాల దర్యాప్తులో పాల్గొన్న FBI అధికారుల మెడపై సస్పెన్షన్ కత్తి వేలాడుతోంది. పదుల కొద్దీ సంఖ్యలో అధికారులను వ్యవస్థ నుంచి తప్పించాలని ట్రంప్ భావిస్తున్నట్లు సమాచారం. వాషింగ్టన్ పోస్ట్ ఈ విషయంపై ఓ కథనాన్ని ప్రచురించింది. అధికారులతో పాటు 30మంది ఫెడరల్ ప్రాసిక్యూటర్స్ను ప్రభుత్వం సస్పెండ్ చేసిందని పేర్కొంది. మరోవైపు ట్రంప్ నిర్ణయాల్ని డెమొక్రాట్లు ఖండిస్తున్నారు.
News February 1, 2025
కాసేపట్లో మంత్రులతో CM అత్యవసర భేటీ
TG: సీఎం రేవంత్ కాసేపట్లో మంత్రులతో అత్యవసరంగా సమావేశం కానున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరగనున్న ఈ భేటీలో ఎమ్మెల్సీ, స్థానిక ఎన్నికలతో పాటు ప్రభుత్వ, పార్టీ అంతర్గత వ్యవహారాలు, తాజా రాజకీయాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అధికారులెవరూ ఈ మీటింగ్కు రావొద్దని ఆదేశించినట్లు సమాచారం.
News February 1, 2025
బడ్జెట్కు క్యాబినెట్ ఆమోదం
2025-26 బడ్జెట్కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పార్లమెంటు భవనంలో సమావేశమైన క్యాబినెట్ పద్దుకు ఆమోదముద్ర వేసింది. ఉ.11 గంటలకు ఆర్థికమంత్రి నిర్మల బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఎన్డీయే మూడో టర్మ్లో ఇదే తొలి పూర్తిస్థాయి బడ్జెట్.