News May 21, 2024

ఓటేయని మూడు గ్రామాల ప్రజలు

image

తమ సమస్యలు పట్టించుకోవడం లేదంటూ యూపీ, జార్ఖండ్‌లోని మూడు గ్రామాల ప్రజలు ఐదో దశ ఎన్నికల పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. UPలోని కౌశాంబి(D) హిసామ్‌పూర్, బారాబంకి(D)లోని పరహాజీ వాసులు తమ గ్రామాల్లో బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటు జార్ఖండ్‌లోని కుసుంబా గ్రామానిది అదే దుస్థితి. అండర్ పాస్ నిర్మించాలని ఎన్నో ఏళ్లుగా కోరుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.

Similar News

News December 30, 2025

స్పెర్మ్ డొనేషన్.. ఈ రూల్స్ తెలుసా?

image

* 3-5 రోజులు శృంగారానికి దూరంగా ఉండాలి.
* 21-45 వయసుతో ఫిజికల్‌గా, మెంటల్‌గా హెల్తీగా ఉండాలి.
* స్మోకింగ్, డ్రింకింగ్, డ్రగ్స్‌ అలవాటు ఉండకూడదు.
* 1ml స్పెర్మ్‌లో 15-20 మిలియన్ల కణాలలో 40% యాక్టివ్ సెల్స్ ఉండాలి.
* HIV, హెపటైటిస్ B, C, సిఫిలిస్, సిస్టిక్ ఫైబ్రోసిస్ వ్యాధులు ఉండకూడదు.
* డొనేట్ చేసిన 6నెలల తర్వాత డోనర్‌కు మరోసారి టెస్టులు చేసి నెగటివ్ వస్తేనే స్పెర్మ్‌ ఉపయోగిస్తారు.

News December 30, 2025

టుడే టాప్ స్టోరీస్

image

*అసెంబ్లీలో కేసీఆర్‌ను పలకరించిన CM రేవంత్
*ఏపీలో 28 జిల్లాలు ఏర్పాటు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం.. జనవరి 1నుంచి అమలులోకి
*రాయచోటి ప్రజలకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి క్షమాపణలు
*మచిలీపట్నం నుంచి హైదరాబాద్ ఫ్యూచర్ సిటీకి ఎక్స్‌ప్రెస్ వే
*ఉన్నావ్ రేప్ కేసు.. సెంగార్‌ను విడుదల చేయొద్దన్న సుప్రీంకోర్టు
*FIDE వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాలు గెలిచిన హంపి, అర్జున్ ఎరిగైసి

News December 30, 2025

గౌరవం ఇచ్చి పుచ్చుకునేది: KTR

image

TG: అసెంబ్లీలో సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్‌ <<18701442>>కరచాలనం<<>> చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో లేచి నిలబడకపోవడంతో KTRపై విమర్శలొచ్చాయి. వాటికి ఆయన తనదైనశైలిలో సమాధానం చెప్పారు. ‘నేను వ్యక్తులను బ్యాడ్‌గా ట్రీట్ చేయను. వాళ్లు ఎలా ఉంటారో అలాగే ట్రీట్ చేస్తాను’ అన్న కొటేషన్ షేర్ చేశారు. దానికి ‘గౌరవాన్ని గెలుచుకోవాలి.. ఆత్మగౌరవం విషయంలో రాజీ పడకూడదు’ అని క్యాప్షన్ పెట్టారు.