News June 4, 2024
ప్రజలకు గుర్తుంది.. పార్టీలకు గుర్తే మిగిలింది!

మహారాష్ట్రలో శివసేనను చీల్చి అసలైన శివసేన గుర్తు పొందిన CM ఏకనాథ్ శిండే వర్గానికి 5 సీట్లొచ్చాయి. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వ శివసేన 11 చోట్ల గెలుపు వైపు పయనిస్తోంది. ఇక NCPని విభజించి ఆ లోగో పొందిన అజిత్ పవార్ గ్రూపుకు ఒక్క సీటే దక్కగా శరద్ పవార్ NCP 6 చోట్ల ఆధిక్యంలో ఉంది. దీంతో చీల్చిన వర్గాలకు గుర్తులు తప్ప ఓట్లు మిగులలేదు. ఓటర్లంతా గుర్తుంచుకుంటారు అనేందుకు ఇదే ఉదాహరణ అని విశ్లేషకులు చెబుతున్నారు.
Similar News
News December 26, 2025
VHT: మరో మ్యాచ్ ఆడనున్న కోహ్లీ?

విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీ తరఫున కోహ్లీ అదరగొడుతున్నా విషయం తెలిసిందే. ఆడిన 2 మ్యాచుల్లో 133, 77 రన్స్ చేశారు. నేషనల్ టీమ్లోని ప్లేయర్లంతా డొమెస్టిక్ క్రికెట్లో ఏడాదికి కనీసం 2మ్యాచులు ఆడాలని BCCI రూల్ పెట్టింది. అందుకే రోహిత్, కోహ్లీ చెరో రెండు మ్యాచులు ఆడేశారు. కానీ కోహ్లీ మరో మ్యాచ్ కూడా ఆడనున్నట్లు తెలుస్తోంది. జనవరి 6న రైల్వేస్తో జరిగే మ్యాచ్లోనూ విరాట్ పాల్గొనే అవకాశమున్నట్లు సమాచారం.
News December 26, 2025
లలిత్ మోదీ, మాల్యాలను వెనక్కు రప్పిస్తాం: విదేశాంగ శాఖ

₹వేల కోట్లు కొల్లగొట్టి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా, <<18653986>>లలిత్ మోదీలను <<>> దేశానికి రప్పించడానికి కట్టుబడి ఉన్నామని కేంద్రం పేర్కొంది. అంతర్జాతీయ చట్టాలు, విదేశీ న్యాయ చిక్కులతో వారిని రప్పించడంలో జాప్యం అవుతున్నట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో పేర్కొన్నారు. కాగా లండన్లో లలిత్ మోదీ, విజయ్ మాల్యా పుట్టినరోజు వేడుకల్లో చేసిన కామెంట్స్ వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
News December 26, 2025
తెలంగాణ కోసం పోరాడేది BRS మాత్రమే: KCR

TG: కాంగ్రెస్ ఎప్పుడూ తెలంగాణకు ద్రోహమే చేసిందని, రాష్ట్రం కోసం BRS తప్ప ఇతర పార్టీలు పోరాడవని ముఖ్య నేతలతో నిర్వహించిన భేటీలో కేసీఆర్ స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్రోహం, అన్యాయాన్ని అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరిద్దామని సూచించారు. సమావేశాల అనంతరం మూడు జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఆ వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.


