News March 17, 2024

మోదీ రాక కోసం ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురుచూశారు: పవన్

image

AP: రాష్ట్రంలో దుష్టపాలన అంతం కాబోతోందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు. అభివృద్ధి లేక, అవినీతి, అరాచక పాలనతో కొట్టుమిట్టాడుతోన్న రాష్ట్రానికి అండగా నిలిచేందుకు వచ్చిన మోదీకి స్వాగతం పలుకుతున్నామన్నారు. మోదీ రాక కోసం ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురుచూశారని పేర్కొన్నారు. తమ కూటమికి దుర్గమ్మ ఆశీస్సులు ఉన్నాయని తెలిపారు. మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమని జోస్యం చెప్పారు.

Similar News

News November 21, 2025

కొత్త లేబర్ కోడ్‌లతో ప్రయోజనాలు..

image

✧ నేటి నుంచి <<18350734>>అమల్లోకి<<>> వచ్చిన లేబర్ కోడ్లతో 7వ తేదీలోపే వేతనం
✧ పురుషులతో సమానంగా మహిళలకు శాలరీ, రాత్రి పనిచేసే అవకాశం
✧ గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్లకు గుర్తింపు.. PF, ESIC, ఇన్సూరెన్స్, OT చేసే కార్మికులకు డబుల్ పేమెంట్
✧ ఫిక్స్‌డ్ టర్మ్ ఉద్యోగులకు ఏడాది తర్వాత గ్రాట్యుటీ
✧ 40 ఏళ్లు పైబడిన కార్మికులకు ఏటా ఉచిత హెల్త్ చెకప్
✧ ప్రమాదకర రంగాల్లో పనిచేసే వారికి 100% ఆరోగ్య భద్రత

News November 21, 2025

పారిశ్రామికవేత్తలుగా SHG మహిళలకు ప్రోత్సాహం: మంత్రి కొండపల్లి

image

AP: SHG మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని, సకాలంలో బ్యాంకు రుణాలు అందేవిధంగా చర్యలు చేపట్టాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 39,000 మందికి పైగా మహిళలు రూ.578 కోట్లతో వ్యాపారాలు ప్రారంభించారని, 2026 మార్చి నాటికి SHGలకు రూ.32,322 కోట్ల రుణాలు అందజేయాలన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలను బలోపేతం చేసి, మద్దతు ఇవ్వాలని సూచించారు.

News November 21, 2025

ఇతిహాసాలు క్విజ్ – 73 సమాధానాలు

image

సమాధానం: పంచ పాండవుల ప్రాణాలు తీసే శక్తి కలిగిన 5 బాణాలను భీష్ముడి నుంచి దుర్యోధనుడు తీసుకుంటాడు. దివ్య దృష్టితో ఈ విషయం తెలుసుకున్న కృష్ణుడికి పూర్వం అర్జునుడికి, దుర్యోధనుడు వరమిచ్చిన విషయం గుర్తుకు వస్తుంది. దీంతో ఆయన అర్జునుడిని, దుర్యోధనుడి వద్దకు పంపి ఆ బాణాలు కావాలనే వరం కోరమని చెబుతాడు. ఇచ్చిన వరం కారణంగా, మాట తప్పకూడదు కాబట్టి దుర్యోధనుడు వాటిని అర్జునుడికి ఇచ్చేస్తాడు. <<-se>>#Ithihasaluquiz<<>>