News March 17, 2024
మోదీ రాక కోసం ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురుచూశారు: పవన్
AP: రాష్ట్రంలో దుష్టపాలన అంతం కాబోతోందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు. అభివృద్ధి లేక, అవినీతి, అరాచక పాలనతో కొట్టుమిట్టాడుతోన్న రాష్ట్రానికి అండగా నిలిచేందుకు వచ్చిన మోదీకి స్వాగతం పలుకుతున్నామన్నారు. మోదీ రాక కోసం ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురుచూశారని పేర్కొన్నారు. తమ కూటమికి దుర్గమ్మ ఆశీస్సులు ఉన్నాయని తెలిపారు. మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమని జోస్యం చెప్పారు.
Similar News
News July 3, 2024
అమ్మాయిలా ‘విశ్వక్సేన్’.. ‘లైలా’ ఫస్ట్ లుక్ రిలీజ్
మాస్ క్యారెక్టర్స్కు కేరాఫ్ అడ్రస్గా మారిన హీరో విశ్వక్సేన్ తొలిసారి అమ్మాయి పాత్రలో కనిపించబోతున్నారు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో విశ్వక్ ‘లైలా’ సినిమాలో నటిస్తున్నారు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమం నేడు జరగ్గా ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. లేడీ గెటప్లో విశ్వక్ బ్యూటిఫుల్గా ఉన్నారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా 2025 FEB 14న మూవీ రిలీజ్ కానుంది.
News July 3, 2024
’కల్కి‘లో దీపిక నటనపై రణ్వీర్ సింగ్ ప్రశంసలు
కల్కి సినిమాలో తన భార్య దీపికా పదుకొణె అత్యద్భుతంగా నటించారని బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ ప్రశంసించారు. భారతీయ సినిమాలో కల్కి ఉత్తమ చిత్రమని ఇన్స్టాగ్రాంలో రాసుకొచ్చారు. నిన్న రాత్రి కుటుంబసభ్యులతో కలిసి రణ్వీర్ సినిమా చూశారు. ప్రభాస్, కమల్ హాసన్ నటనతో అదరగొట్టారని, తన లాంటి అమితాబ్ ఫ్యాన్స్ ఈ చిత్రాన్ని తప్పక చూడాలని పేర్కొన్నారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది.
News July 3, 2024
121కి చేరిన మరణాలు.. భోలే బాబా పరార్
యూపీలోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 121కి చేరింది. నిన్న 116 మంది మరణించగా చికిత్స పొందుతూ ఈరోజు మరో ఐదుగురు ప్రాణాలు విడిచారు. ఇదిలా ఉంటే అక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమం ఏర్పాటు చేసిన భోలే బాబా పరారైనట్లు పోలీసులు వెల్లడించారు. బాబాకు సంబంధించిన రామ్ కుటీర్ ఛారిటబుల్ ట్రస్టులో వెతికినా ఆయన కనిపించలేదని తెలిపారు.