News April 28, 2024

NDAకు ఓటేయకుంటే ప్రజలకే నష్టం: పవన్

image

AP: ఎన్డీఏ కూటమికి ఓటేయకుంటే ప్రజలే నష్టపోతారని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నారు. ‘నేను ప్రధాని మోదీతో ధైర్యంగా మాట్లాడగలను. కానీ సీఎం జగన్‌కు ఆయనంటే భయం. కేసుల గురించే ఆయన మోదీని కలుస్తారు. రాష్ట్ర సమస్యలపై ఎన్నడూ ప్రధానిని కలవలేదు. అరటి తొక్క లాంటి వైసీపీ ప్రభుత్వాన్ని చెత్తబుట్టలో పడేయండి. జనసేన గళాన్ని అసెంబ్లీలో వినిపించాలి. అందుకే ఈ ఎన్నికల్లో కూటమిని ఆశీర్వదించండి’ అని ఆయన పిలుపునిచ్చారు.

Similar News

News December 9, 2025

హీరో రాజశేఖర్‌కు గాయాలు

image

హీరో రాజశేఖర్ కొత్త సినిమా షూటింగ్‌లో గాయపడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 25న మేడ్చల్ సమీపంలో యాక్షన్ సీక్వెన్స్ చేస్తుండగా ఆయన కుడి కాలి మడమ వద్ద గాయమైంది. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించగా 3గంటల పాటు మేజర్ సర్జరీ చేసినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. శస్త్రచికిత్స సక్సెస్ అయిందని, 4 వారాలు విశ్రాంతి తర్వాత ఆయన మళ్లీ మూవీ షూటింగ్‌లో పాల్గొంటారని చెప్పాయి.

News December 9, 2025

పవన్ దిష్టి వ్యాఖ్యలపై మంత్రి మనోహర్ ఏమన్నారంటే?

image

AP: Dy.CM పవన్ వ్యాఖ్యలను వక్రీకరించారని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కోనసీమకు దిష్టి తగిలిందని రైతులతో మాట్లాడిన సందర్భంలోనే అన్నారని, ఇది రాజకీయం చేయాల్సిన అంశం కాదని తెలిపారు. పవన్‌కు TG ప్రజలపై ఎంతో నమ్మకం, ప్రేమ ఉన్నాయని చెప్పారు. ఆ మాటలపై అనవసర రాద్దాంతం చేశారని పేర్కొన్నారు. పవన్ వ్యాఖ్యలపై ఇప్పటికే జనసేన ప్రకటన విడుదల చేయగా, మరో మంత్రి కందుల దుర్గేశ్ సైతం వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే.

News December 9, 2025

మా కంపెనీ చరిత్రలోనే అతిపెద్ద ఇన్వెస్ట్‌మెంట్: గల్లా జయదేవ్

image

TG: పెట్టుబడులకు హైదరాబాద్ బెస్ట్ డెస్టినేషన్ అని మాజీ ఎంపీ, అమర్‌రాజా గ్రూప్ ఛైర్మన్ గల్లా జయదేవ్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కంపెనీలకు మంచి సహకారం అందిస్తున్నారని గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన తెలిపారు. ఫ్యూచర్ సిటీలో రూ.9వేల కోట్లతో ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని, తమ కంపెనీ చరిత్రలోనే ఇదే అతిపెద్ద ఇన్వెస్ట్‌మెంట్ అని పేర్కొన్నారు. మరోవైపు అవసరమైతే మళ్లీ రాజకీయాల్లోకి వస్తాయని ఆయన ప్రకటించారు.