News November 20, 2024

ప్రాపర్టీ/ రియల్ ఎస్టేట్‌ వైపే ప్రజల మొగ్గు

image

భారతీయ కుటుంబాలు ఈక్విటీ మార్కెట్ల కంటే కూడా సంప్రదాయ పెట్టుబడుల వైపే మొగ్గుచూపుతున్నాయని తాజాగా ఓ నివేదికలో వెల్లడైంది. ఇంటిని కలిగి ఉండటమే ప్రధాన ఆస్తిగా భావిస్తున్నారు. దీంతో మొత్తం ఆస్తుల్లో 51.3శాతం ప్రాపర్టీ/ రియల్ ఎస్టేట్ వాటాను కలిగిఉంది. రెండో ప్లేస్‌లో 15.2శాతంతో బంగారం, 13.3% బ్యాంక్ డిపాజిట్స్, 5.8% ఈక్విటీ, 5.7% పెన్షన్ స్కీమ్స్, 3% మంది నగదును కలిగి ఉన్నారు.

Similar News

News February 6, 2026

రెండు రోజుల్లో రూ.7,090 తగ్గిన గోల్డ్ రేటు

image

బంగారం ధర ఇవాళ కూడా తగ్గి కొనుగోలుదారులకు ఊరటనిచ్చింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.2,070 తగ్గి రూ.1,52,350కు చేరింది. రెండు రోజుల్లోనే రూ.7,090 తగ్గడం విశేషం. 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,900 పతనమై రూ.1,39,650 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.

News February 6, 2026

INDతో మ్యాచును బాయ్‌కాట్ చేస్తే పాక్‌కే దెబ్బ!

image

T20 WCలో భారత్‌తో మ్యాచును బాయ్‌కాట్ చేస్తే పాకిస్థాన్‌కు గ్రూప్ స్టేజ్ దాటడమే కష్టంగా మారొచ్చు. ఈ మ్యాచ్ ఆడకపోతే గ్రూప్‌లోని మిగతా జట్లపై(USA, నమీబియా, నెదర్లాండ్స్) కచ్చితంగా గెలవాలి. లేదంటే NRRపై ఆధారపడాల్సి వస్తుంది. 2024 WCలో PAKను USA ఓడించింది. దీంతో ఈసారీ ఆ టీమ్ నుంచి పాక్‌కు ముప్పు ఉంది. ఈ నేపథ్యంలో INDతో మ్యాచ్ ఆడితేనే గెలుపు కోసం ప్రయత్నించేందుకు PAKకు మరో అవకాశం(మ్యాచ్) ఉంటుంది.

News February 6, 2026

ఆయిల్ ఫామ్.. టన్నుకు రూ.224 అదనం

image

AP: తెలంగాణా కంటే రాష్ట్రంలోని ఆయిల్ ఫామ్ రైతులకు టన్నుకు అదనంగా రూ.224 చెల్లిస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. 2025-26 ఏడాదిలో 20.01% ఆయిల్ ఎక్స్‌ట్రాక్షన్ రేషియో(ఓయూఆర్)ను ప్రభుత్వం ప్రకటించిందని.. దీని వల్ల టన్ను ఆయిల్ ఫామ్‌కు రూ.20,680 ధర లభించిందని తెలిపారు. తెలంగాణలో జనవరికి సంబంధించి పామాయిల్ రైతులకు టన్నుకి రూ.20,456 ధర వస్తే.. ఏపీలో అదనంగా రూ.224 లభించిందని పేర్కొన్నారు.