News November 20, 2024
ప్రాపర్టీ/ రియల్ ఎస్టేట్ వైపే ప్రజల మొగ్గు

భారతీయ కుటుంబాలు ఈక్విటీ మార్కెట్ల కంటే కూడా సంప్రదాయ పెట్టుబడుల వైపే మొగ్గుచూపుతున్నాయని తాజాగా ఓ నివేదికలో వెల్లడైంది. ఇంటిని కలిగి ఉండటమే ప్రధాన ఆస్తిగా భావిస్తున్నారు. దీంతో మొత్తం ఆస్తుల్లో 51.3శాతం ప్రాపర్టీ/ రియల్ ఎస్టేట్ వాటాను కలిగిఉంది. రెండో ప్లేస్లో 15.2శాతంతో బంగారం, 13.3% బ్యాంక్ డిపాజిట్స్, 5.8% ఈక్విటీ, 5.7% పెన్షన్ స్కీమ్స్, 3% మంది నగదును కలిగి ఉన్నారు.
Similar News
News November 23, 2025
బోస్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News November 23, 2025
శ్రీవారి ఆలయంలో పంచబేర వైభవం

తిరుమల శ్రీవారి ఆలయ గర్భగుడిలో 5 ప్రధానమైన మూర్తులు కొలువై ఉన్నాయి. ప్రధానమైనది, స్వయంవ్యక్త మూర్తి అయినది ధ్రువబేరం. నిత్యం భోగాలను పొందే మూర్తి భోగ శ్రీనివాసుడు ‘కౌతుకబేరం’. ఉగ్ర రూపంలో ఉండే స్వామి ఉగ్ర శ్రీనివాసుడు ‘స్నపన బేరం’. రోజువారీ కొలువు కార్యక్రమాలలో పాల్గొనే మూర్తి కొలువు శ్రీనివాసుడు ‘బలిబేరం’. ఉత్సవాల కోసం ఊరేగింపుగా వెళ్లే మూర్తి మలయప్పస్వామి ‘ఉత్సవబేరం’. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 23, 2025
రేపు వాయుగుండం.. 48 గంటల్లో తుఫాన్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మలక్కా, సౌత్ అండమాన్ మీదుగా కొనసాగుతోందని APSDMA తెలిపింది. ఇది వాయవ్యదిశగా కదులుతూ రేపటికల్లా వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. అదేవిధంగా కొనసాగుతూ 48 గంటల్లో తుఫాన్గా బలపడే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు ఏపీలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే పేర్కొన్న సంగతి తెలిసిందే.


