News April 28, 2024

మా పాలనలో ప్రజల జీవితాలు బాగుపడ్డాయి: సీఎం జగన్

image

AP: వైసీపీ పాలనలో పౌర సేవలన్నీ ఇంటికే వస్తున్నాయని CM జగన్ అన్నారు. ‘ పెన్షన్లు, రేషన్, వైద్య సేవలు ఇంటికే అందేలా వ్యవస్థను ఏర్పాటు చేశాం. మరో 15ఏళ్లు ఇలాంటి పాలన ఉంటే ప్రజల జీవితాలు ఇంకెంత బాగుపడతాయో ఆలోచించండి. ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చని చంద్రబాబు లాంటి మోసకారిని నమ్మొచ్చా? సైకిల్‌‌ను ఇంటి బయటే ఉంచాలి.. గ్లాసుని సింక్‌లో పడెయ్యాలి. వైసీపీకి ఒక్క సీటు తగ్గకుండా గెలిపించాలి’ అని కోరారు.

Similar News

News January 2, 2026

త్వరలో 265 పోస్టుల భర్తీ: మంత్రి కోమటిరెడ్డి

image

TG: R&B శాఖలో ఖాళీగా ఉన్న 265 ఇంజినీర్ల పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఫీల్డ్‌లో ఉండే AEలకు ల్యాప్‌టాప్‌లు అందజేస్తామని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న సీనియారిటీ సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. R&B ఇంజినీర్స్ డైరీ, క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. తమ శాఖ ఇంజినీర్లు, ఉద్యోగులు తనకు కుటుంబ సభ్యులతో సమానమన్నారు. తర్వాత ఉద్యోగులతో కలిసి భోజనం చేశారు.

News January 2, 2026

కృష్ణ వర్ణం – అనంత ఆరోగ్య సంకేతం

image

కృష్ణుడి నీలిరంగు అనంతమైన ఆకాశానికి, అగాధమైన సముద్రానికి ప్రతీక. ఆయన వ్యక్తిత్వంలోని లోతును, ధైర్యాన్ని ఈ రంగు సూచిస్తుంది. శ్రీకృష్ణుడు ధరించిన ఈ నీలి రంగును చూస్తే మెదడులో ప్రశాంతతనిచ్చే హార్మోన్లు విడుదలవుతాయని పరిశోధనల్లో తేలింది. ఈ రంగు గుండె వేగాన్ని నియంత్రించి ఒత్తిడిని తగ్గిస్తుందట. మానసిక స్థిరత్వాన్ని, రోగనిరోధక శక్తిని ప్రసాదిస్తుందట. నీలి రంగు ఈ విశ్వంలో ప్రాణవాయువుకు చిహ్నం.

News January 2, 2026

ఏడాదిలో 166 పులుల మృత్యువాత

image

2025లో దేశంలో 166 పులులు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. టైగర్స్ స్టేట్‌గా పేరుపొందిన మధ్యప్రదేశ్‌లో 55, మహారాష్ట్రలో 38, కేరళలో 13, అస్సాంలో 12 మరణించాయి. పులుల సంరక్షణ అథారిటీ ప్రకారం 2024తో పోలిస్తే 40 డెత్స్ ఎక్కువగా నమోదయ్యాయి. ‘టైగర్స్ జనాభా సంతృప్తస్థాయికి చేరుకుంది. టెర్రిటరీల ఏర్పాటులో అవి ఇబ్బంది పడుతున్నాయి. ఈ క్రమంలో గొడవ పడి చనిపోతున్నాయి’ అని వన్యప్రాణి నిపుణుడు జైరాం శుక్లా తెలిపారు.