News December 26, 2024

YCPపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోంది: సజ్జల

image

AP: సమస్యలపై తక్షణమే స్పందిస్తుండటంతో వైసీపీపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోందని ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కష్టకాలంలో వారికి అండగా ఉంటామని నేతలు భరోసా అందించాలని ఆయన చెప్పారు. ‘కూటమి ప్రభుత్వం ప్రజలపై రూ.15 వేల కోట్ల విద్యుత్ ఛార్జీల భారం మోపింది. దీనిని వ్యతిరేకిస్తూ వైసీపీ నిరసన చేపట్టాలి. ఈ నెల 27న అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించాలి’ అని ఆయన నేతలకు సూచించారు.

Similar News

News September 17, 2025

రూ.15 వేల ఆర్థికసాయం.. నేటి నుంచే అప్లికేషన్లు

image

AP: ఆటో/క్యాబ్ డ్రైవర్లకు రూ.15 వేల ఆర్థిక సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వాహనమిత్ర పథకం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అర్హులైన వారు నేటి నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం రిలీజ్ చేసిన ప్రత్యేక <<17731468>>ఫామ్‌లో<<>> వివరాలు నింపి ఈ నెల 19లోపు సచివాలయాల్లో అందజేయాలి. ఎంపికైన డ్రైవర్ల అకౌంట్లలో అక్టోబర్‌ 1న ప్రభుత్వం నగదు జమ చేయనుంది.

News September 17, 2025

మైథాలజీ క్విజ్ – 8

image

1. రామాయణంలో మైథిలి అంటే ఎవరు?
2. కురుక్షేత్రంలో పాండవుల ప్రధాన సైన్యాధిపతి ఎవరు?
3. ‘పుతనా’ రాక్షసిని చంపింది ఎవరు?
4. విష్ణువు శయనించే పాము పేరు ఏమిటి?
5. ‘బృహదీశ్వర ఆలయం’ ఎక్కడ ఉంది?
వీటి ఆన్సర్స్ మైథాలజీ క్విజ్-9 (రేపు 7AM)లో పబ్లిష్ చేస్తాం.
<<17714352>>మైథాలజీ క్విజ్ – 7<<>> జవాబులు: 1.జయవిజయులు 2.సరయు 3.దేవవ్రతుడు 4.ఉత్తరాఖండ్ 5.వినాయక చవితి

News September 17, 2025

పలు శాఖల పనితీరుపై సీఎం ఆగ్రహం

image

AP: హోం, మున్సిపల్, రెవెన్యూ శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ శాఖలపై ప్రజల్లో అసంతృప్తి ఉందని సర్వేలు తేల్చాయని కలెక్టర్ల సదస్సులో వెల్లడించారు. హోంశాఖ, మున్సిపల్ శాఖలు సరిగా పనిచేయడం లేదని తనకు ఫీడ్‌బ్యాక్‌ వచ్చిందన్నారు. అన్నిశాఖల మంత్రులు, అధికారులు ఫైళ్లను వెంటనే క్లియర్ చేయాలని ఆదేశించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.