News December 26, 2024
YCPపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోంది: సజ్జల

AP: సమస్యలపై తక్షణమే స్పందిస్తుండటంతో వైసీపీపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోందని ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కష్టకాలంలో వారికి అండగా ఉంటామని నేతలు భరోసా అందించాలని ఆయన చెప్పారు. ‘కూటమి ప్రభుత్వం ప్రజలపై రూ.15 వేల కోట్ల విద్యుత్ ఛార్జీల భారం మోపింది. దీనిని వ్యతిరేకిస్తూ వైసీపీ నిరసన చేపట్టాలి. ఈ నెల 27న అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించాలి’ అని ఆయన నేతలకు సూచించారు.
Similar News
News November 25, 2025
నేడు మరో అల్పపీడనం.. 5 రోజులు వర్షాలు!

AP: మలక్కా జలసంధి పరిసరాల్లో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం నేడు వాయుగుండంగా బలపడనుందని APSDMA తెలిపింది. మరో 48hrsలో తుఫానుగా మారనుందని పేర్కొంది. అటు ఇవాళ నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. వీటి ప్రభావంతో ఇవాళ్టి నుంచి 28 వరకు ద.కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. 29, 30 తేదీల్లో ద.కోస్తా. రాయలసీమల్లో భారీ నుంచి అతి భారీ, ఉ.కోస్తాలో భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది.
News November 25, 2025
ఆశ్లేష కురిస్తే ముసలియెద్దూ రంకెవేస్తుంది..

ఆశ్లేష నక్షత్రంలో ( జూలై చివరిలో/ ఆగస్టు ప్రారంభంలో) వర్షాలు బాగా పడితే, ఆ సంవత్సరంలో పంటలు బాగా పండుతాయని, పచ్చగడ్డి, మేత పుష్కలంగా లభిస్తాయని రైతులకు నమ్మకం. ఈ సమృద్ధి కారణంగా, సాధారణంగా నీరసంగా లేదా బలహీనంగా ఉండే ముసలి ఎద్దులు కూడా కడుపునిండా తిని, కొత్త శక్తిని పొంది, సంతోషంతో ఉత్సాహంగా అరుస్తాయనేది ఈ సామెత భావం. మంచి రోజులు వచ్చినప్పుడు అందరూ సంతోషిస్తారని అర్థం
News November 25, 2025
శివుడి అవతారమే హనుమంతుడు

హనుమంతుడు అంజనా దేవి పుత్రుడు. శివుడి వంటి పుత్రుడిని పొందాలని పరమేశ్వరుడికి పూజలు చేసింది. ఆ పూజల ఫలితంగా శివుడి వరంతోనే హనుమంతుడు జన్మించాడు. ఆయనను శివుని అవతారంగా భావిస్తారు. శివుడి లాగే ఆయన కూడా పరిపూర్ణ యోగి. అష్ట సిద్ధులకు యజమాని. ఆయన తన దైవశక్తిని ఏనాడూ స్వార్థానికి ఉపయోగించలేదు. తన ప్రభువు రాముడిని సేవించడానికి మాత్రమే వినియోగించారు. ఆయనను పూజిస్తే ఈశ్వరుడి అనుగ్రహం కూడా కలుగుతుందట.


