News December 26, 2024

YCPపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోంది: సజ్జల

image

AP: సమస్యలపై తక్షణమే స్పందిస్తుండటంతో వైసీపీపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోందని ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కష్టకాలంలో వారికి అండగా ఉంటామని నేతలు భరోసా అందించాలని ఆయన చెప్పారు. ‘కూటమి ప్రభుత్వం ప్రజలపై రూ.15 వేల కోట్ల విద్యుత్ ఛార్జీల భారం మోపింది. దీనిని వ్యతిరేకిస్తూ వైసీపీ నిరసన చేపట్టాలి. ఈ నెల 27న అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించాలి’ అని ఆయన నేతలకు సూచించారు.

Similar News

News November 15, 2025

SBI కస్టమర్లకు BIG ALERT

image

SBI కీలక ప్రకటన చేసింది. నవంబర్ 30 తర్వాత ఆన్‌లైన్, యోనో లైట్ ద్వారా డబ్బును పంపే, క్లెయిమ్ చేసే mCASH సేవలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. UPI, IMPS, NEFT, RTGS తదితర డిజిటల్ పేమెంట్ సేవలను ఉపయోగించుకోవచ్చని తెలిపింది. లబ్ధిదారుడిని ముందుగా రిజిస్టర్ చేయకుండానే మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్ ఐడీ ద్వారా డబ్బు లావాదేవీలు చేయడం కోసం mCASHను గతంలో SBI తీసుకొచ్చింది.

News November 15, 2025

అంతులేని ప్రేమకూ ముగింపు తప్పదు!

image

అవసరాలు.. అంతులేని ప్రేమకూ ముగింపునిస్తాయని తెలిపే ఘటన చైనాలో జరిగింది. 2017లో జాన్ అనే మహిళ లంగ్ క్యాన్సర్‌తో ఎంతోకాలం జీవించదని డాక్టర్లు తెలిపారు. భార్యను అమితంగా ప్రేమించే భర్త జున్మిన్ ఆమెను cryopreservation పద్ధతిలో సంరక్షించేందుకు ఓ సంస్థతో 30ఏళ్ల ఒప్పందం చేసుకున్నాడు. ఇలా చేసిన తొలి వ్యక్తిగా నిలిచాడు. అయితే ఇటీవల అనారోగ్యానికి గురైన అతను తోడులేకుండా ఉండలేనని రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు.

News November 15, 2025

అసలు క్రయోప్రిజర్వేషన్ అంటే ఏమిటి?

image

ప్రస్తుతం రోజుకో కొత్త ఆవిష్కరణ మానవ జీవనాన్ని సులభతరం చేస్తోంది. ఈ క్రమంలోనే క్రయోప్రిజర్వేషన్ అనే పద్ధతికి సైంటిస్టులు నాంది పలికారు. అంటే ఒక శవాన్ని ఖననం చేయకుండా -196°C దగ్గర ద్రవ నైట్రోజన్‌లో నిల్వచేస్తారు. ఫ్యూచర్‌లో చనిపోయిన వ్యక్తిని బతికించే టెక్నాలజీ వస్తే ఆ దేహాన్ని ఉపయోగించుకుంటారు. రక్తం గడ్డకట్టకుండా, కణాలకు నష్టం జరగకుండా ఆ బాడీని చల్లబరిచే ప్రక్రియలో రక్షక ద్రావణాలను వాడతారు.