News December 26, 2024
YCPపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోంది: సజ్జల

AP: సమస్యలపై తక్షణమే స్పందిస్తుండటంతో వైసీపీపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోందని ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కష్టకాలంలో వారికి అండగా ఉంటామని నేతలు భరోసా అందించాలని ఆయన చెప్పారు. ‘కూటమి ప్రభుత్వం ప్రజలపై రూ.15 వేల కోట్ల విద్యుత్ ఛార్జీల భారం మోపింది. దీనిని వ్యతిరేకిస్తూ వైసీపీ నిరసన చేపట్టాలి. ఈ నెల 27న అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించాలి’ అని ఆయన నేతలకు సూచించారు.
Similar News
News January 26, 2026
జెండా ఆవిష్కరణ.. ఈ తేడాలు తెలుసా?

గణతంత్ర, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జెండాను ఎగురవేసే విధానంలో ఉండే తేడాలు చాలామందికి తెలిసుండదు. ఆగస్టు 15న ప్రధానమంత్రి కింద ఉన్న జెండాను పైకి లాగి ఎగురవేస్తారు. దీనిని హోయిస్టింగ్ అంటారు. ఇది వలస పాలన నుంచి విముక్తిని సూచిస్తుంది. అదే జనవరి 26న పైన కట్టిన జెండాను విప్పుతారు. దీనిని ‘అన్ ఫర్లింగ్’ అంటారు. ఇది రాజ్యాంగం అమలులోకి రావడాన్ని సూచిస్తుంది. రాష్ట్రపతి దీనిని నిర్వహిస్తారు. SHARE IT
News January 26, 2026
బన్నీతో సినిమాపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ లోకేశ్

LCUని పక్కనపెట్టి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో సినిమా తీసేందుకు సిద్ధమవడంపై డైరెక్టర్ లోకేశ్ కనగరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘మైత్రీ మూవీ మేకర్స్ & బన్నీతో చాలాకాలంగా ఉన్న కమిట్మెంట్ కారణంగా ఈ మూవీ తొలుత పట్టాలెక్కనుంది. ఇది పూర్తయ్యాక ఖైదీ-2, విక్రమ్-2, రోలెక్స్ సినిమాలుంటాయి. రెమ్యునరేషన్ కారణంగా ఖైదీ-2 నుంచి వైదొలిగాననేది అవాస్తవం’ అని లోకేశ్ వెల్లడించారు.
News January 26, 2026
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో పోస్టులు.. అప్లై చేశారా?

బారక్పోర్లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (<


