News July 26, 2024

ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: CM రేవంత్

image

TG: ధరణి పోర్టల్‌లో సవరణల వల్ల కొత్త సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ సూచించారు. సచివాలయంలో ధరణిలో సమస్యలు, మార్పులు-చేర్పులపై సమీక్ష నిర్వహించారు. ‘ధరణి సమస్యలపై లోతుగా అధ్యయనం చేసి శాశ్వత పరిష్కారం చూపాలి. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అభిప్రాయాలు తీసుకోవాలి. వాటి ఆధారంగా సమగ్ర చట్టం తేవాలి. అవసరమైతే అసెంబ్లీలో దీనిపై చర్చ పెడదాం’ అని అన్నారు.

Similar News

News April 4, 2026

ధురంధర్: హీరోయిన్ కోసం 1,200 మందికి ఆడిషన్!

image

‘ధురంధర్’ మూవీలో హీరోయిన్‌గా సారా అర్జున్‌ను ఎంపిక చేయడానికి గల కారణాన్ని క్యాస్టింగ్ డైరెక్టర్ ముకేశ్ ఛబ్రా తాజాగా వెల్లడించారు. ‘రణ్‌వీర్‌తో నటించాలని అనుకుంటున్నట్లు చాలామంది ఆదిత్య ధర్, నాకు మెసేజ్‌లు పంపారు. అయితే అక్కడి(పాక్‌) వ్యక్తిలా కనిపించే, కొత్త ముఖం కావాలని భావించాం. ఇప్పటికే రణ్‌వీర్‌తో నటించిన వాళ్లు సరిపోరు. 1,200-1,300 మందికి ఆడిషన్ చేసి చివరికి సారాను ఎంపిక చేశాం’ అని తెలిపారు.

News April 4, 2026

ఇరాన్ నుంచి స్థిరంగా ఆయిల్ సరఫరా: ఇండియా

image

పశ్చిమాసియాలో అంతరాయాలు ఎదురవుతున్నప్పటికీ దేశీయ రిఫైనరీలు స్థిరంగా క్రూడాయిల్ పొందుతున్నాయని పెట్రోలియం శాఖ తెలిపింది. ఇరాన్ సహా పలు దేశాల నుంచి సరఫరా కొనసాగుతోందని ట్వీట్ చేసింది. దిగుమతులకు సంబంధించి చెల్లింపులకు అడ్డంకి లేదని స్పష్టం చేసింది. పేమెంట్ సమస్యల వల్ల ఇండియాకు రావాల్సిన ఆయిల్ ట్యాంకర్ చైనాకు వెళ్లిందన్న వార్తలను ఖండించింది. నౌకలు కొన్నిసార్లు గమ్యస్థానాలను మార్చుకుంటాయంది.

News April 4, 2026

ఆలయాల వద్ద రాజకీయ కార్యకలాపాలపై నిషేధం: CM

image

TTD తరహాలో తెలంగాణలోని ఆలయాల వద్ద రాజకీయ కార్యకలాపాలను నిషేధించాలని CM రేవంత్ అధికారులను ఆదేశించారు. ఆలయాల పవిత్రతకు భంగం కలగకుండా రూల్స్ కఠినం చేయాలన్నారు. ₹225CRతో బాసర ఆలయ అభివృద్ధి ప్రణాళికను CM సమీక్షించారు. ‘భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ, శాస్త్ర ప్రకారం అభివృద్ధి చేయాలి. విశాలమైన రోడ్లు ఉండాలి. EVలను వినియోగించాలి’ అని సూచించారు. ఈనెల 6న ఈ పనులకు CM శంకుస్థాపన చేస్తారు.