News March 6, 2025

PES విద్యాసంస్థల అధినేత కన్నుమూత

image

పీఈఎస్ విద్యాసంస్థల అధినేత ప్రొఫెసర్ ఎంఆర్ దొరస్వామి నాయుడు(85) కన్నుమూశారు. చిత్తూరు జిల్లాలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన దొరస్వామి 1972లో బెంగళూరులో 40 మంది విద్యార్థులతో పీఈఎస్ విద్యాసంస్థను ప్రారంభించారు. కర్ణాటక ఎమ్మెల్సీగా, ప్రభుత్వ సలహాదారుడిగా విద్యారంగానికి విశేషంగా కృషి చేశారు. బెంగళూరులోని తన నివాసంలో గురువారం సాయంత్రం దొరస్వామి నాయుడు తుది శ్వాస విడిచారు.

Similar News

News February 7, 2026

కుప్పంలో వరుసగా అమ్మాయిల మిస్సింగ్

image

కుప్పం నియోజకవర్గ పరిధిలో వారం రోజుల్లో ఐదుగురు యువతుల మిస్సింగ్ ఆందోళన కలిగిస్తోంది. ప్రేమ వ్యవహారమో లేక కుటుంబ కారణాల నేపథ్యమో తెలియదు గానీ మైనర్ బాలికలతో పాటు 22 ఏళ్లలోపు యువతులు అదృశ్యమవుతున్నారు. వారం రోజుల్లో రామకుప్పం పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు, రాళ్ల బూదుగూరు పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు, కుప్పం అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక్క మిస్సింగ్ కేసు నమోదయింది.

News February 7, 2026

చిత్తూరు: కోళ్ల మృతి.. కారణం ఇదే..!

image

ఉమ్మడి చిత్తూరు జిల్లా సదుం మండలంలో వేలాది నాటు కోళ్లు చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో కంభంవారిపల్లె క్రాస్ వద్ద ఉన్న కోళ్ల ఫారాన్ని పశుసంవర్ధక శాఖ జేడీ ఉమాదేవి, జిల్లా అధికారులు శుక్రవారం పరిశీలించారు. వీటి నమూనాలను భోపాల్ ల్యాబ్ పంపించామని చెప్పారు. త్వరలోనే నివేదిక వస్తుందన్నారు. ప్రస్తుతం తమకున్న నివేదిక ప్రకారం దీనిని కొక్కర తెగుళ్లుగా భావిస్తున్నామన్నారు.

News February 7, 2026

చిత్తూరు: కోళ్ల మృతి.. కారణం ఇదే..!

image

ఉమ్మడి చిత్తూరు జిల్లా సదుం మండలంలో వేలాది నాటు కోళ్లు చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో కంభంవారిపల్లె క్రాస్ వద్ద ఉన్న కోళ్ల ఫారాన్ని పశుసంవర్ధక శాఖ జేడీ ఉమాదేవి, జిల్లా అధికారులు శుక్రవారం పరిశీలించారు. వీటి నమూనాలను భోపాల్ ల్యాబ్ పంపించామని చెప్పారు. త్వరలోనే నివేదిక వస్తుందన్నారు. ప్రస్తుతం తమకున్న నివేదిక ప్రకారం దీనిని కొక్కర తెగుళ్లుగా భావిస్తున్నామన్నారు.