News November 29, 2024
దర్గాపై పిటిషన్.. ముదురుతున్న వివాదం

మతపరమైన ప్రార్థనా స్థలాల ఉనికిని సవాల్ చేస్తూ పలువురు కోర్టును ఆశ్రయిస్తున్నారు. సంభల్ అల్లర్లు చల్లారకముందే తాజాగా అజ్మీర్ షరీఫ్ దర్గా ప్రదేశంలో గతంలో శివాలయం ఉండేదంటూ పిటిషన్ దాఖలైంది. శ్రీకృష్ణ జన్మభూమి ట్రస్ట్ భూమిలో ఈద్గాను నిర్మించారంటూ మథురలో, మధ్యప్రదేశ్లోని ధార్లో, వారణాసిలోని జ్ఞానవాపిలో ప్రార్థనా స్థలాల ఉనికిని సవాల్ చేస్తూ వరుస పిటిషన్లు దాఖలవ్వడంతో ఈ తరహా వివాదాలు అధికమయ్యాయి.
Similar News
News October 18, 2025
బొప్పాయిలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు.. నివారణ ఇలా

ఫంగల్ ఇన్ఫెక్షన్లు లేదా ఆంత్రాక్నోస్ కారణంగా బొప్పాయి చెట్ల ఆకులపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ఇవి పెద్దవిగా మారి ఆకులకు రంధ్రాలు ఏర్పడి రాలిపోతాయి. వ్యాధి తీవ్రమైతే పండ్లు నాశనమవుతాయి. ఈ లక్షణాలు కనిపించిన ఆకులను ఏరివేసి నాశనం చేయాలి. చెట్ల మొదట్లో నీరు నిలిచిపోకుండా చూసుకోవాలి. లీటరు నీటికి మాంకోజెబ్ 2.5గ్రా. లేదా క్లోరోథలోనిల్ 2 గ్రా. కలిపి 15 రోజుల వ్యవధిలో రెండు దఫాలుగా పిచికారీ చేయాలి.
News October 18, 2025
పిల్లల ప్రశ్నలను గౌరవించి రిప్లై ఇవ్వండి: వైద్యులు

పిల్లల సృజనాత్మకత పెరగాలంటే వారు ప్రశ్నలు అడగటాన్ని ప్రోత్సహించాలని మానసిక వైద్యుడు శ్రీకాంత్ సూచించారు. ‘ఐదేళ్ల లోపు చిన్నారులు రోజుకు సుమారు 300 ప్రశ్నలు అడుగుతారు. ఇది వారి అపారమైన ఉత్సుకతకు నిదర్శనం. తల్లిదండ్రులు వారి ప్రశ్నలకు ఓపిగ్గా జవాబివ్వడం, తెలియని వాటికి తెలుసుకొని చెప్తా అనడం చాలా ముఖ్యం. ప్రశ్నించడాన్ని అణచివేస్తే వారు స్వతంత్రంగా ఆలోచించే శక్తిని కోల్పోవచ్చు’ అని హెచ్చరించారు.
News October 18, 2025
CCRHలో 31 పోస్టులు

సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి (<