News October 18, 2024
సుప్రీంకోర్టులో గ్రూప్-1 అభ్యర్థుల పిటిషన్

TG: గ్రూప్-1 మెయిన్స్ను వాయిదా వేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వం రూల్ ఆఫ్ లా పాటించట్లేదని అభ్యర్థుల తరఫు లాయర్ మోహిత్ పేర్కొన్నారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. మరోవైపు గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాల్లో తప్పులున్నాయంటూ పలువురు దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు సింగిల్ బెంచ్ కొట్టేసింది. ఆ తీర్పును వారు డివిజన్ బెంచ్లో సవాల్ చేశారు. దీనిపై కాసేపట్లో విచారణ జరగనుంది.
Similar News
News January 10, 2026
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి కొత్త హీరో.. ఫస్ట్ లుక్ రిలీజ్

సూపర్ స్టార్ కృష్ణ మనుమడు, ఘట్టమనేని రమేశ్ బాబు తనయుడు జయకృష్ణ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ‘RX 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న మూవీకి ‘శ్రీనివాస మంగాపురం’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ను మహేశ్ బాబు తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో రవీనా టాండన్ కూతురు రాషా తడాని హీరోయిన్గా నటిస్తుండగా, జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నారు.
News January 10, 2026
కోటీశ్వరులు పెరిగారు!

దేశంలో కోటీశ్వరుల సంఖ్య 2025-26 ఆర్థిక సంవత్సరంలో స్వల్పంగా పెరిగింది. ఈ-ఫైలింగ్ పోర్టల్ సమాచారం మేరకు కోటికి పైగా ఆస్తులు ప్రకటించిన వారి సంఖ్య 3,17,098 నుంచి 3,85,752కి పెరిగింది. మరోవైపు 2025-26 ఆర్థిక సంవత్సరంలో 9 కోట్లకు పైగా ఐటీ రిటర్నులు దాఖలయ్యాయి. అంతకుముందు ఇది 8.92 కోట్లుగా ఉండేది. కోటీశ్వరుల సంఖ్యలో 21.65% వృద్ధి నమోదు కాగా, రిటర్నులు 1.22% మాత్రమే పెరగడం గమనార్హం.
News January 10, 2026
వంటింటి చిట్కాలు

* పిండి వంటలు చేసేటపుడు మూకుడులో నూనె పొంగకుండా ఉండాలంటే మరుగుతున్న నూనెలో తమలపాకు వేసి, అది రంగు మారాక తీస్తే సమస్య ఉండదు.
* గారెలు, వడలు చేసే పిండిలో కొద్దిగా సేమియాను పొడిగా చేసి కలిపితే నూనె లాగవు. కరకరలాడతాయి.
* అరిసెలు వండేటప్పుడు పాకంలో బియ్యం పిండి సరిపోకపోతే తగినంత గోధుమపిండి కలపండి.
* సమోసా కరకరలాడుతూ రావాలంటే మైదా పిండిలో కాస్త మొక్కజొన్న పిండిని కలిపితే సరిపోతుంది.


