News March 28, 2024

తాజ్‌మహల్‌ను శివాలయంగా ప్రకటించాలని పిటిషన్

image

తాజ్‌మహల్‌ను శివాలయంగా ప్రకటించాలని మరో పిటిషన్ దాఖలైంది. యోగేశ్వర్ శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంఘ్ ట్రస్ట్ అధ్యక్షుడు అజయ్ ప్రతాప్ UPలోని ఆగ్రా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజ్‌మహల్‌లో నిర్వహిస్తున్న ఇస్లామిక్ కార్యకలాపాలను నిలిపివేయాలని కోరారు. దీనిపై APR 9న విచారణ జరగనుంది. మహల్‌ను శివాలయంగా ప్రకటించాలని కోరుతూ ఇప్పటికే దాఖలైన పలు పిటిషన్లను కోర్టు కొట్టివేయగా, మరికొన్ని పెండింగ్‌లో ఉన్నాయి.

Similar News

News January 27, 2026

‘యానిమల్’ సీక్వెల్‌పై రణ్‌బీర్ క్రేజీ అప్‌డేట్

image

యానిమల్ సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు రణ్‌బీర్ కపూర్ క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. ‘యానిమల్ పార్క్’ షూటింగ్ 2027లో ప్రారంభమయ్యే ఛాన్స్ ఉందని తెలిపారు. ప్రస్తుతం డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా వేరే సినిమా పనుల్లో బిజీగా ఉన్నట్లు గుర్తుచేశారు. పైగా ఆయన దీన్ని 3 పార్ట్‌లుగా ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు. సీక్వెల్‌లో తాను డ్యుయల్ రోల్‌లో కనిపించే అవకాశం ఉందని చెప్పారు.

News January 27, 2026

భారత్-EU ఒప్పందాలపై ప్రధాని ట్వీట్

image

ఇండియా- యురోపియన్ యూనియన్ (EU) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడం ఒక కీలక మైలురాయి అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ ఒప్పందం ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడమే కాకుండా పెట్టుబడులు & ఉపాధికి కొత్త మార్గాలను తెరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. యూరప్ నేతలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ భాగస్వామ్యం ఉజ్వల భవిష్యత్తుకు పునాది అని ట్వీట్ చేశారు. ఈ చరిత్రాత్మక అడుగుతో IND-యూరప్ మధ్య సహకారం మరింత పెరగనుంది.

News January 27, 2026

భారత్ భారీ స్కోర్

image

ఐసీసీ U19 వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ 352-8 స్కోర్ చేసింది. విహాన్ సెంచరీ(109*) బాదగా, అభిజ్ఞాన్ కుందు 61, వైభవ్ సూర్యవంశీ 52, ఆరోన్ 23, కెప్టెన్ ఆయుష్ మాత్రే(21), అంబ్రిష్ 21, ఖిలాన్ పటేల్ 30 రన్స్ చేశారు. కాగా గ్రూప్ స్టేజీలో హ్యాట్రిక్ విజయాలతో యంగ్ ఇండియా జోరుమీదున్న విషయం తెలిసిందే.