News March 11, 2025
PGRSలో వచ్చిన అర్జీలు వెంటనే పరిష్కారం చేయాలి: కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) ద్వారా వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కారం చేయాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ అన్నారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆమె పాల్గొని స్వయంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజా సమస్యల విషయంలో ఎవరు అలసత్వం వహించరాదని అధికారులను ఆదేశించారు.
Similar News
News March 11, 2025
సీఆర్డీఏ సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు

వెలగపూడిలోని అసెంబ్లీలోని ఛాంబర్లో మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పలు విషయాలపై మంత్రులకు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో పొంగూరు నారాయణ, కేశవ్ పయ్యావుల, సీఎస్ విజయానంద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.
News March 11, 2025
GNT : లాడ్జిలో కిడ్నాప్, హత్యాయత్నం .. కారణమిదే.!

గుంటూరులోని లాడ్జిలో వ్యక్తిని కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. ఆ ఘటనకు వివాహేతర సంబంధంమే కారణమని తెలుస్తోంది. మప్పాళ్లలోని చాగంటివారిపాలెం వాసి రామలింగేశ్వరరావు అదే ప్రాంత మహిళతో సంబంధం ఉంది. సోమవారం అతను మహిళతో లాడ్జిలో ఉండగా .. గమనించిన బంధువులు ఫాలో చేసి పట్టుకుని కొట్టి తీసుకెళ్లారు. లాలాపేట పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. బాధితుని ఫిర్యాదుతో కిడ్నాప్, హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
News March 11, 2025
గుంటూరు: జీబీఎస్ కలకలం.. 3కు చేరిన మృతులు

గుంటూరులో జీబీఎస్ మరణాల సంఖ్య మూడుకు చేరింది. పల్నాడు జిల్లా మాదలకు చెందిన సీతామహాలక్ష్మి (50) ఈనెల 5న జీజీహెచ్ లో చేరారు. కాగా చికిత్స పొందుతూ.. సోమవారం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. జీబీఎస్ లక్షణాలతో చికిత్స పొందుతున్న మిగిలిన వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు.