News October 6, 2025
₹9వేల కోట్లతో HYDలో ఫార్మా కంపెనీ: US సంస్థతో చర్చ

TG: Eli Lilly(US) సంస్థ ప్రతినిధులు CM రేవంత్తో భేటీ అయ్యారు. HYDలో ₹9వేల కోట్లతో ఫార్మా పరిశ్రమ ఏర్పాటుపై సంస్థ ప్రెసిడెంట్ ప్యాట్రిక్
జాన్సన్ చర్చించారు. మాన్యుఫ్యాక్చర్ ప్లాంట్, క్వాలిటీ సెంటర్ నెలకొల్పుతామన్నారు. కాగా ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందని సీఎం వారికి హామీ ఇచ్చారు. HYDలో అనేక దిగ్గజ కంపెనీలు ఉన్నాయని, దేశంలో 40 శాతం బల్క్ డ్రగ్స్ ఇక్కడే ఉత్పత్తి అవుతున్నాయని వివరించారు.
Similar News
News March 27, 2026
S-400 సహా రక్షణ కొనుగోళ్లకు ₹2.38 లక్షల కోట్లు

భారత రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.2.38 లక్షల కోట్లతో ఆయుధాల కొనుగోలుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ ఆధ్వర్యంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్(DAC) ఆమోదం తెలిపింది. రవాణా విమానాలు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ‘S-400’, డ్రోన్లు, యాంటీ ట్యాంక్ వ్యవస్థలు, రిమోట్తో నడిచే స్ట్రైక్ ఎయిర్ క్రాఫ్టులు, ధనుష్ గన్ సిస్టమ్, ఏరియల్ సర్వైలెన్స్ సిస్టమ్ను సేకరించనుంది.
News March 27, 2026
లగ్జరీ ఫ్లాట్ కొన్న గిల్.. బిల్డర్ హీరోయిన్ భర్తే!

దేశంలోనే రిచెస్ట్ పర్సన్స్ నివసించే ముంబై జుహూలో టీమ్ ఇండియా కెప్టెన్ గిల్ లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేశారు. ఏకంగా రూ.20.7 కోట్లు పెట్టి ఓ అపార్ట్మెంట్ 12వ ఫ్లోర్లో 3,369 చ.అ. ఫ్లాట్ కొన్నారు. స్టాంప్ డ్యూటీకే 1.24Cr చెల్లించారు. ఇక ఈ అపార్ట్మెంట్ను ఓ రియల్ ఎస్టేట్ సంస్థతో కలిసి రకుల్ప్రీత్ భర్త జాకీ భగ్నానీ, ఆయన పేరెంట్స్ నిర్మిస్తుండటం గమనార్హం. దీని నిర్మాణం 2029లో పూర్తి కానుంది.
News March 27, 2026
పెంటగాన్లో పెరిగిన పిజ్జా ఆర్డర్లు.. ఏం జరగబోతోంది?

US రక్షణ కార్యాలయం పెంటగాన్ చుట్టుపక్కల <<18781285>>పిజ్జా ఆర్డర్లు<<>> పెరిగితే ఏదో ఒక దేశానికి మూడినట్లేనని ప్రచారం ఎప్పటినుంచో ఉంది. తాజాగా పాపా జాన్స్ ఆర్డర్లు 296%, డొమినోస్ 208%, పిజాటో ఆర్డర్లు 200% పెరిగాయి. పశ్చిమాసియాకు US మరిన్ని బలగాలను పంపనుందనే వార్తల నేపథ్యంలో ఇలా జరగడం గమనార్హం. ‘కొన్ని గంటల్లో కీలక ప్రకటన’ అంటూ వైట్హౌస్ చేసిన ట్వీట్ దీనికి బలాన్ని చేకూరుస్తోంది. అసలేం జరగబోతోంది?


