News November 1, 2024

వేడి నూనె పాత్ర‌లో ప‌డ్డ ఫోన్.. బ్యాట‌రీ పేలి వ్య‌క్తి మృతి

image

వంట చేస్తూ చేతిలో ప‌ట్టుకున్న ఫోన్ వ్యక్తి ప్రాణం తీసింది. మ‌ధ్యప్ర‌దేశ్‌లోని భింద్ జిల్లాలో ఓ వ్యక్తి వంట చేస్తున్న స‌మ‌యంలో చేతిలో ఉన్న ఫోన్ జారి వేడివేడి నూనె పాత్ర‌లో ప‌డింది. దీంతో ఒక్క‌సారిగా బ్యాట‌రీ పేల‌డంతో వ్యక్తికి తీవ్ర గాయాల‌య్యాయి. మెరుగైన వైద్యం కోసం గ్వాలియ‌ర్ త‌ర‌లిస్తుండ‌గా సింధ్ న‌దిపై ట్రాఫిక్ జాంతో అంబులెన్స్ ఆల‌స్యంగా ఆస్ప‌త్రికి చేరుకుంది. బాధితుడు అప్పటికే మృతి చెందాడు.

Similar News

News September 16, 2025

డ్వాక్రా సంఘాలు మరింత ఎత్తుకు ఎదగాలి: CBN

image

AP: మహిళా సాధికారత కోసం తీసుకువచ్చిన డ్వాక్రా సంఘాలు మరింత ఎత్తుకు ఎదగాలని CM చంద్రబాబు ఆకాంక్షించారు. ‘కోటీ 20 లక్షల మంది అతిపెద్ద మహిళా సైన్యం డ్వాక్రా సంఘాల రూపంలో రాష్ట్రానికి ఉంది. నేను ప్రారంభించిన ఈ సంఘాలను ఎవరూ ఏం చేయలేకపోయారు. మహిళా సంఘాలకు రుణం ఇస్తే డబ్బులు బ్యాంకులో ఉన్నట్టే. డ్వాక్రా సంఘాల టర్నోవర్ రూ.10 లక్షల కోట్లకు ఎదగాలని ఆశిస్తున్నా’ అని తెలిపారు.

News September 16, 2025

రానున్న 2-3 గంటల్లో వర్షం.. భారీగా ఈదురు గాలులు

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 2-3 గంటల్లో వర్షం పడే ఛాన్స్ ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. జగిత్యాల, కరీంనగర్, మెదక్, నిర్మల్, సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో మోస్తరు వర్షం కురవొచ్చని అంచనా వేసింది. గంటకు 41-61కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.

News September 15, 2025

DANGER: నిద్ర మాత్రలు వాడుతున్నారా?

image

నిద్ర పట్టేందుకు కొందరు స్లీపింగ్ పిల్స్ వాడుతుంటారు. అయితే వీటి వాడకం ఎక్కువైతే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ప్రమాదకరమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. జ్ఞాపకశక్తి తగ్గడం, తల తిరగడం, ఆందోళన, మెదడు బద్ధకించడం, చూపు అస్పష్టంగా మారడం వంటి సమస్యలు వస్తాయంటున్నారు. వరుసగా 2 రోజులు ఈ మాత్రలు వేసుకుంటే బానిసలవుతారని, డోస్ పెంచాల్సిన పరిస్థితి వస్తుందంటున్నారు. వీటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.