News July 22, 2024

కర్ణాటకకు ఫోన్ పే సీఈఓ క్షమాపణలు

image

తాను కర్ణాటకను ఎప్పుడూ కించపరచలేదని ఫోన్ పే <<13661162>>CEO<<>> సమీర్ నిగమ్ స్పష్టం చేశారు. ఆ రాష్ట్ర ప్రజలకు భేషరతుగా క్షమాపణలు చెబుతున్నానని ప్రకటించారు. తనకు కర్ణాటకను అవమానించే ఆలోచన, ఉద్దేశం లేదని చెప్పారు. కర్ణాటకలోనే ఫోన్ పే పుట్టిందని, అలాంటి నేలను తాను ఎందుకు కించపరుస్తానన్నారు. కాగా కర్ణాటకలోని ప్రైవేటు సంస్థల్లో స్థానిక కోటాను సమీర్ వ్యతిరేకించడంతో ఫోన్ పే పట్ల అక్కడ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

Similar News

News January 6, 2026

ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిని పట్టించే హెల్మెట్!

image

ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనాలను గుర్తించే AI హెల్మెట్‌ను బెంగళూరుకు చెందిన ఓ టెకీ తయారు చేశారు. హెల్మెట్‌కు కెమెరాను అమర్చి దానికి AIని జోడించారు. రోడ్డుపై ఎవరైనా హెల్మెట్ లేకుండా, రాంగ్ రూట్‌లో వెళ్తే ఇది గుర్తించి ఫొటో తీస్తుంది. లొకేషన్, బండి నంబర్‌తో సహా ఆ ఫొటోలను పోలీసులకు పంపి ఛలాన్ వేసేలా చేస్తుంది. టెక్నాలజీ సాయంతో రోడ్డు భద్రతను పెంచే ఇలాంటి ఐడియాలు అవసరమని పోలీసులు అతడిని ప్రశంసించారు.

News January 6, 2026

ఏడిస్తే ముక్కు ఎందుకు కారుతుందో తెలుసా?

image

మానవ శరీర వ్యవస్థ ఒక ఇంజినీరింగ్ అద్భుతం. మన కంటి మూలలో సూది మొనంత ఉండే ‘లాక్రిమల్ పంక్టం’ అనే రంధ్రం ఒక అదృశ్య డ్రైనేజీ పైపులా పనిచేస్తుంది. కళ్లలో ఊరే అదనపు కన్నీళ్లను ఇది ముక్కులోకి పంపిస్తుంది. అందుకే మనం ఏడ్చినప్పుడు ముక్కు కూడా కారుతుంది. ఈ చిన్న రంధ్రం కంటి తేమను కాపాడుతూ చూపును స్పష్టంగా ఉంచుతుంది. అంటే మనం ఏడుస్తున్నప్పుడు ముక్కు నుంచి కారేది ‘కన్నీళ్లే’. share it

News January 6, 2026

పరకామణి అంశంలో పోలీసు అధికారులపై కేసులకు హైకోర్టు ఆదేశం

image

AP: TTD పరకామణి కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. కేసులో ప్రమేయం ఉన్న పోలీసు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఏసీబీ, సీఐడీలకు ఉత్తర్వులు ఇచ్చింది. కేసు దర్యాప్తులో ముందుకు సాగాలని ఆ రెండు విభాగాలకు స్పష్టం చేసింది. పరకామణి లెక్కింపు అంశంలో విధివిధానాలు ఖరారు చేయాలని టీటీడీని ఆదేశించింది. తదుపరి విచారణ ఎల్లుండికి వాయిదా వేసింది.