News November 11, 2024

ఫోన్ స్విచాఫ్.. పరారీలో నటి కస్తూరి?

image

తెలుగువారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరి పరారీలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. తమిళనాడులో ఓ బహిరంగ కార్యక్రమంలో కస్తూరి మాట్లాడుతూ తెలుగు ప్రజలు ప్రాచీన కాలంలో తమిళరాజులకు సేవ చేసిన మహిళలకు వారసులు అని వ్యాఖ్యానించారు. ఇది తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. పలు కేసులు నమోదవడంతో పాటు ఆమెకు లీగల్ నోటీసులు అందాయి. కాగా ఆమె ఇంటికి తాళం వేసి పరారైనట్లు తెలుస్తోంది. ఫోన్ కూడా స్విచాఫ్ అయ్యింది.

Similar News

News November 21, 2025

బ్రెయిన్ స్ట్రోక్‌కి ముందు కనిపించే లక్షణాలు ఇవే

image

మెదడుకు ఆక్సిజన్, రక్తం సరఫరాలో తేడాతో బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. స్ట్రోక్ సడెన్‌గా వచ్చినప్పటికీ నెలల ముందు నుంచే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అసాధారణ తలనొప్పి, ముఖం, కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు, చూపులో తేడా, తలతిరగడం వంటివి బ్రెయిన్ స్ట్రోక్‌ రావడానికి ముందు కనిపించే లక్షణాలని వైద్యులు చెబుతున్నారు. ఒక్కసారిగా నీరసంగా అనిపించడం, అంతే వేగంగా తగ్గినట్టు అనిపిస్తే వెంటనే డాక్టరును సంప్రదించాలి.

News November 21, 2025

బ్రెయిన్ స్ట్రోక్‌కి ముందు కనిపించే లక్షణాలు ఇవే

image

మెదడుకు ఆక్సిజన్, రక్తం సరఫరాలో తేడాతో బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. స్ట్రోక్ సడెన్‌గా వచ్చినప్పటికీ నెలల ముందు నుంచే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అసాధారణ తలనొప్పి, ముఖం, కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు, చూపులో తేడా, తలతిరగడం వంటివి బ్రెయిన్ స్ట్రోక్‌ రావడానికి ముందు కనిపించే లక్షణాలని వైద్యులు చెబుతున్నారు. ఒక్కసారిగా నీరసంగా అనిపించడం, అంతే వేగంగా తగ్గినట్టు అనిపిస్తే వెంటనే డాక్టరును సంప్రదించాలి.

News November 21, 2025

రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు!

image

TG: త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో ఏ గ్రామానికి ఏ రిజర్వేషన్ దక్కుతుందనే చర్చ మళ్లీ మొదలైంది. గతంలో ఉన్న రిజర్వేషన్లు మారనున్నాయి. జనాభా ప్రాతిపదికన వీటిని ఖరారు చేయనున్నారు. రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఇప్పుడున్న కేటగిరీకి కాకుండా మరో కేటగిరీకి ఛాన్స్ రానుంది. దీనిపై రేపు వెలువడే జీవోతో క్లారిటీ రానుంది. రాష్ట్రంలో 12,760గ్రామాల్లో ఎన్నికలు జరగనున్నాయి.