News November 11, 2024
ఫోన్ ట్యాపింగ్ కేసు.. BRS మాజీ ఎమ్మెల్యేకు నోటీసులు

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో BRS నేత, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు జారీ అయ్యాయి. ఇవాళ జూబ్లీహిల్స్ ఏసీపీ ఎదుట విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన పోలీసు అధికారి తిరుపతన్నతో లింగయ్యకు ఫోన్ కాంటాక్టులు ఉన్నట్టు గుర్తించారు.
Similar News
News March 2, 2026
కట్టె జనుములో కాయ తొలిచే పురుగు – నివారణ

రబీలో సాగు చేసే కట్టె జనుమును కాయ తొలిచే పురుగులు ఎక్కువగా ఆశించి నష్టపరుస్తుంటాయి. వీటి నివారణకు పూత దశలో లీటరు నీటికి ప్రొఫెనోఫాస్ 2ml లేదా క్లోరంట్రానిలిప్రోల్ 0.3ml కలిపి సాయంత్రం వేళల్లో పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ శిలీంద్రాల వల్ల విత్తనం రంగుమారడం, కుళ్లిపోవడం జరిగితే కాయ ఏర్పడే దశలో లీటరు నీటికి కార్బండిజం 1గ్రాము కలిపి పిచికారీ చేయాలి.
News March 2, 2026
APCRDAలో ఉద్యోగాలు

అమరావతిలోని APCRDAలో 4 కాంట్రాక్ట్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి పీజీ(ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్; ఎకాలజీ), PhD, డిగ్రీ, CAIIB, BTech అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అర్హత, అనుభవం ఆధారంగా వేతనం చెల్లిస్తారు. వెబ్సైట్: https://crda.ap.gov.in
News March 2, 2026
BREAKING: తగ్గిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹3,290 తగ్గి ₹1,69,800కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు ₹3,000 తగ్గి ₹1,55,650 పలుకుతోంది. ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప తేడాలు ఉండొచ్చు.


