News March 19, 2025
ఫోన్ ట్యాపింగ్.. వారిద్దరికీ రెడ్ కార్నర్ నోటీసులు

TG: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ SIB చీఫ్ ప్రభాకర్ రావు, ఓ మీడియా సంస్థ అధినేత శ్రవణ్ కుమార్కు రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయినట్టు అధికారులు ప్రకటించారు. దీనిపై CBI నుంచి రాష్ట్ర సీఐడీకి సమాచారం వచ్చింది. వారిద్దరినీ వీలైనంత త్వరగా మన దేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర హోంశాఖ, విదేశాంగ శాఖలతో హైదరాబాద్ పోలీసులు సంప్రదింపులు జరుపుతున్నారు.
Similar News
News December 19, 2025
ఐదో టీ20: టాస్ ఓడిన భారత్

అహ్మదాబాద్ వేదికగా భారత్తో జరుగుతోన్న ఐదో టీ20లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టీమ్ ఇండియాలో హర్షిత్, గిల్, కుల్దీప్ స్థానాల్లో బుమ్రా, శాంసన్, సుందర్ వచ్చారు.
IND: సూర్య(C), శాంసన్, అభిషేక్, తిలక్, పాండ్య, జితేశ్, సుందర్, దూబే, వరుణ్, బుమ్రా, అర్ష్దీప్
News December 19, 2025
Unknown నంబర్ నుంచి వీడియో కాల్ చేసి..

అన్నోన్ నంబర్ల నుంచి వచ్చే వీడియో కాల్స్ లిఫ్ట్ చేయొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇలా ఓ మహిళతో వీడియో కాల్ మాట్లాడిన HYD వ్యక్తి బ్లాక్మెయిల్కు గురై ₹3.41L పోగొట్టుకున్నాడు. మహిళ వీడియో కాల్ చేసి అతడిని సెడ్యూస్ చేయగా, అది వైరల్ చేస్తామంటూ మరో వ్యక్తి బెదిరించాడు. పలుమార్లు డబ్బులు వసూలు చేశాడు. తన బ్యాంక్ అకౌంట్స్ హ్యాకవడం, మరిన్ని డబ్బులు డిమాండ్ చేయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
News December 19, 2025
వైఎస్ జగన్ బర్త్ డే CDP పోస్ట్ చేసిన వైసీపీ

AP: ఎల్లుండి వైసీపీ చీఫ్ జగన్ పుట్టినరోజు నేపథ్యంలో ఆయన CDPని ఆ పార్టీ Xలో పోస్ట్ చేసింది. ప్రజా నాయకుడు జగన్ అని పేర్కొంటూ ఫొటోను రిలీజ్ చేసింది. ‘సవాళ్లు ఎదురైనా.. కష్టాలు పరీక్షించినా మొక్కవోని దీక్షతో నమ్మిన సిద్ధాంతానికి నిబద్ధతతో నిలబడే నాయకుడు వైఎస్ జగన్. పుట్టిన రోజు శుభాకాంక్షలు జగన్ అన్న’ అని ట్వీట్ చేసింది.


