News March 19, 2025
ఫోన్ ట్యాపింగ్.. వారిద్దరికీ రెడ్ కార్నర్ నోటీసులు

TG: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ SIB చీఫ్ ప్రభాకర్ రావు, ఓ మీడియా సంస్థ అధినేత శ్రవణ్ కుమార్కు రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయినట్టు అధికారులు ప్రకటించారు. దీనిపై CBI నుంచి రాష్ట్ర సీఐడీకి సమాచారం వచ్చింది. వారిద్దరినీ వీలైనంత త్వరగా మన దేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర హోంశాఖ, విదేశాంగ శాఖలతో హైదరాబాద్ పోలీసులు సంప్రదింపులు జరుపుతున్నారు.
Similar News
News March 19, 2025
పాత ఫోన్.. గంటకు పైగా ఛార్జ్ చేస్తే పేలే ప్రమాదం

పాత ఫోన్లు కొనొద్దని నిపుణులు సూచిస్తున్నారు. వాటిలోని చెడిపోయిన బ్యాటరీ స్థానంలో క్వాలిటీ లేని చైనా బ్యాటరీని అమర్చుతారని చెబుతున్నారు. అలాంటి బ్యాటరీని గంటకు పైగా ఛార్జ్ చేస్తే వేడెక్కి పేలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అలాగే ఫోన్ను ఎక్కువ సేపు ప్లగ్ ఇన్ చేసి ఉంచకూడదంటున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ రాజ్గఢ్ జిల్లాలో సెకండ్ హ్యాండ్ మొబైల్ పేలి ఓ యువకుడికి తీవ్రగాయాలయ్యాయి.
News March 19, 2025
సునీత.. మీరు పట్టుదల అంటే ఏంటో చూపించారు: మోదీ

ISS నుంచి భూమిపైకి తిరిగొచ్చిన సునీతా విలియమ్స్, ఇతర వ్యోమగాములను PM మోదీ ప్రశంసించారు. ‘వెల్కమ్ బ్యాక్ crew9. మిమ్మల్ని భూమి చాలా మిస్ అయింది. పట్టుదల అంటే ఏంటో చూపించారు. ఎంతో మందికి మీరు స్ఫూర్తి. అంతరిక్ష అన్వేషణ అంటే సామర్థ్యానికి మించి సరిహద్దుల్ని దాటుకుని వెళ్లడం, కలల్ని నిజం చేసుకునే ధైర్యం ఉండటం. సునీత ఒక ఐకాన్. వారిని సురక్షితంగా తీసుకొచ్చిన వారి పట్ల గర్వంగా ఉన్నాం’ అని ట్వీట్ చేశారు.
News March 19, 2025
రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

TG: బడ్జెట్లో రైతు భరోసాకు రూ.18 వేల కోట్లు కేటాయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఇక ఏడాదికి ఎకరానికి రూ.12 వేల చొప్పున అందుతాయని చెప్పారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా రైతు భరోసా అందిస్తామని స్పష్టం చేశారు. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం బడ్జెట్గా రూ.24,439 కోట్లు కేటాయించడం గమనార్హం. ఇప్పటికే మూడు ఎకరాల లోపు వారికి రైతు భరోసా నగదు జమ చేసిన సంగతి తెలిసిందే.