News June 3, 2024
ఫోన్ ట్యాపింగ్.. హైకోర్టులో సుమోటో విచారణ

TG: ఫోన్ ట్యాపింగ్ కేసును హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. గతంలో TSPSC పేపర్ లీకేజీ కేసులో హైకోర్టు న్యాయమూర్తి ఫోన్ను సైతం ట్యాప్ చేసినట్లు పోలీసు అధికారి భుజంగరావు అంగీకరించారు. దీనిపై మీడియాలో వార్తలు రావడంతో ప్రధాన న్యాయమూర్తి ఆలోక్ అరాధే ధర్మాసనం సుమోటోగా స్వీకరించింది. దీనిపై రేపు మధ్యాహ్నం విచారణ జరపనుంది.
Similar News
News January 24, 2026
SRPT: ఇంజనీరింగ్ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

జిల్లాలో వివిధ ఇంజనీరింగ్ శాఖల ద్వారా చేపట్టిన పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన తన ఛాంబర్లో ఈడబ్ల్యూఐడీసీ, టీజీఎంఐడీసీ, ఆర్అండ్బీ తదితర శాఖల పనులపై సమీక్ష నిర్వహించారు. భవిత కేంద్రాలను ఫిబ్రవరి చివరి నాటికి, కేజీబీవీ మరమ్మతులను ఫిబ్రవరి 15 నాటికి పూర్తి చేయాలన్నారు. మిగతావి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచించారు.
News January 24, 2026
T20 WC నుంచి బంగ్లా ఔట్.. ఏం జరిగింది?

బంగ్లాలో అల్లర్లు, హిందువులపై దాడులతో భారతీయుల్లో నిరసన వ్యక్తమైంది. దీంతో IPLలో KKR తరఫున ఆడాల్సిన ముస్తాఫిజుర్ను తొలగించాలని BCCI ఆదేశించింది. అందుకు ప్రతీకారంగా BAN తమ దేశంలో IPL ప్రసారాన్ని నిలిపివేయడంతో వివాదం ముదిరింది. INDలో T20 WCకు తామూ రాబోమని BAN మొండికేసింది. వేదికల మార్పు కుదరదని ICC తేల్చి చెప్పింది. BAN తమ నిర్ణయాన్ని మార్చుకోకపోవడంతో WCకు ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్ను తీసుకుంది.
News January 24, 2026
హైకోర్టులే ప్రాథమిక సంరక్షకులు: సీజేఐ సూర్యకాంత్

సాధారణ ప్రజలకు న్యాయం అందించడంలో హైకోర్టుల పాత్ర అత్యంత కీలకమని CJI జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ఇవి ప్రాథమిక సంరక్షకులుగా నిలుస్తున్నాయని అభిప్రాయపడ్డారు. న్యాయం ప్రజలకు దూరమైన భావన రాకుండా చేయడంలో వీటి పాత్ర ఎంతో ఉందని కొనియాడారు. HCలు కేవలం అప్పీల్/రివిజన్ కోర్టులుగా కాకుండా, రాజ్యాంగ పరిరక్షణకు అందుబాటులో ఉండే కేంద్రాలుగా మారాలన్నారు. నేరుగా SCను ఆశ్రయించడాన్ని తాను వ్యతిరేకిస్తానన్నారు.


