News July 22, 2024
PHOTO: అసెంబ్లీ బయట నల్లకండువాతో పెద్దిరెడ్డి

ఇవాల్టి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన TDP, YCP MLAలు,MLCలు అమరావతికి చేరుకున్నారు. పసుపు షర్టులతో TDP MLAలు సభలోకి ప్రవేశించారు. మరోవైపు మాజీ మంత్రి, పుంగనూరు MLA పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నల్ల కండువా ధరించి YCP అధినేత జగన్తో కలిసి రాష్ట్రంలోని హత్యలపై నిరసన తెలిపారు. తర్వాత అసెంబ్లీలోకి వెళ్లినా.. కాసేపటికే సభను వాకౌట్ చేసి బయటకు వచ్చారు.
Similar News
News November 17, 2025
CII సదస్సు విజయవంతం: రాజన్

విశాఖపట్నం వేదికగా జరిగిన CII సదస్సు విజయవంతమైనట్లు చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు రాజన్ తెలిపారు. చిత్తూరులోని పార్టీ ఆఫీసులో ఆదివారం మాట్లాడారు. ఏపీలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ వేదిక ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఏపీ పారిశ్రామిక హబ్గా మారుతుందన్నారు. ఈ కార్యక్రమంలో MP ప్రసాదరావు, ఎమ్మెల్యేలు నాని, మురళీమోహన్ ఎమ్మెల్సీ శ్రీకాంత్ పాల్గొన్నారు.
News November 16, 2025
CII సదస్సు విజయవంతం: రాజన్

విశాఖపట్నం వేదికగా జరిగిన CII సదస్సు విజయవంతమైనట్లు చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు రాజన్ తెలిపారు. చిత్తూరులోని పార్టీ ఆఫీసులో ఆదివారం మాట్లాడారు. ఏపీలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ వేదిక ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఏపీ పారిశ్రామిక హబ్గా మారుతుందన్నారు. ఈ కార్యక్రమంలో MP ప్రసాదరావు, ఎమ్మెల్యేలు నాని, మురళీమోహన్ ఎమ్మెల్సీ శ్రీకాంత్ పాల్గొన్నారు.
News November 16, 2025
కర్ణాటకలో మిస్సింగ్.. కుప్పంలో డెడ్ బాడీ

కర్ణాటక అత్తిబెలే సమీపంలో మిస్సయిన శ్రీనాథ్ డెడ్ బాడీ కుప్పంలో పూడ్చిపెట్టినట్లు కర్ణాటక పోలీసులు గుర్తించారు. కుప్పం ఎన్టీఆర్ కాలనీకి చెందిన శ్రీనాథ్ అత్తిబెలే వద్ద నివాసం ఉంటుండగా గత నెల 27 నుంచి కనబడడం లేదంటూ కుటుంబ సభ్యులు అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామకుప్పం(M) ముద్దునపల్లికి చెందిన ప్రభాకర్ను అదుపులోకి తీసుకోగా మృతదేహాన్ని జగనన్న కాలనీలోని ఓ ఇంట్లో పూడ్చిపెట్టినట్లు గుర్తించారు.


