News February 18, 2025
PHOTO: క్రికెట్ ఆడిన మంత్రి బీసీ

మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి కర్నూలు జిల్లా పత్తికొండలో మంగళవారం పర్యటించారు. కేఈ మాదన్న మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 18 రోజులుగా నిర్వహిస్తోన్న క్రికెట్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్కు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, MLA కేఈ శ్యామ్ బాబులతో కలిసి ఫైనల్ మ్యాచ్ను ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్న అనంతరం మంత్రి బీసీ క్రికెట్ ఆడి ఉత్సాహపరిచారు.
Similar News
News September 17, 2025
ఆసియా కప్: గంట సమయం కోరిన పాక్!

అవసరమైతే ఆసియా కప్ను బహిష్కరిస్తామన్న పాక్ ఇప్పుడు పునరాలోచనలో పడింది. మ్యాచ్ ప్రారంభ సమయాన్ని గంట పొడిగించాలని పీసీబీ కోరినట్లు క్రీడావర్గాలు తెలిపాయి. దీంతో ఇంకా హోటల్ నుంచి బయల్దేరని ఆటగాళ్లు చేరుకునేందుకే అడిగి ఉండొచ్చని సమాచారం. కాగా భారత్తో హ్యాండ్ షేక్ వివాదంతో మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్ను తొలగించాలని, లేదంటే మిగతా మ్యాచులు ఆడమని PCB ప్రకటించింది. కానీ ఈ డిమాండ్ను ICC తిరస్కరించింది.
News September 17, 2025
IFSCAలో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండి

ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ(<
News September 17, 2025
అనకాపల్లి: ‘8ఏళ్ల తర్వాత దొరికిన నిందితుడు’

కొత్తకోట, రావికమతం పోలీస్ స్టేషన్లలో గంజాయి అక్రమ రవాణాకు సంబంధించిన 4కేసుల్లో నిందితుడు 8ఏళ్ల తర్వాత చిక్కాడని సర్కిల్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు బుధవారం తెలిపారు. కాకినాడకు చెందిన కొరపాకల కుమారస్వామి (33)పై 2017లో కేసు నమోదు కాగా ఆనాటి నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడు. హైదరాబాద్లోని భవానినగర్ పెట్రోల్ బంక్లో పనిచేస్తున్న అతనిని తమ సిబ్బంది అరెస్టు చేయగా రిమాండ్కు తరలించామన్నారు.