News August 24, 2025
PHOTO: బుట్టలెన్ని అల్లినా బువ్వ కరువాయే

కొన్ని వృత్తుల వారు ఎంత శ్రమించినా ఆకలి తీరని పరిస్థితి, దానికి ఉదాహరణే పై చిత్రం. పాచిపెంటలో బుట్టలు అల్లుకుని 10 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. అడవి నుంచి వెదురు కలప తెచ్చి బుట్టలతో గృహలంకరణ వస్తువులు అల్లి వాటిని స్థానికంగా విక్రయించడంతో పాటు ఒడిశాకి ఎగుమతి చేస్తుంటారు. ప్లాస్టిక్ బుట్టలు వాడకంతో పాటు మద్దతు ధర లేక పూట గడవడం కష్టమవుతోందని.. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
Similar News
News August 24, 2025
GATE-2026 షెడ్యూల్లో మార్పు

M.Tech, PhD కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్(GATE-2026) షెడ్యూల్ మారింది. రేపటి నుంచి దరఖాస్తుల ప్రక్రియ స్టార్ట్ కావాల్సి ఉండగా పోస్ట్పోన్ అయింది. ఈనెల 28నుంచి అప్లికేషన్లు స్వీకరించనున్నట్లు అధికారిక <
News August 24, 2025
SKLM: రేపు ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక

ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం జరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు వారి సమస్యలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్ సైట్ను వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. అర్జీలు సమర్పించిన అనంతరం 1100 నంబర్కు నేరుగా ఫోన్ చేసి, వినతులకు సంబంధించిన స్థితి సమాచారం తెలుసుకోవచ్చని అన్నారు.
News August 24, 2025
కొరిశపాడులో దొంగతనం.. రూ.1.85కోట్ల ల్యాప్ట్యాప్ల చోరీ

బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం మేదరమెట్ల వద్ద భారీ చోరీ జరిగిన ఘటన ఆదివారం వెలుగు చూసింది. స్థానికుల వివరాల మేరకు.. ఓ కంటైనర్ హైదరాబాదు నుంచి చెన్నై వెళ్తోంది. ఈ క్రమంలో కంటైనర్ నుంచి సుమారు 250 ల్యాప్టాప్లను గుర్తు తెలియని దుండగులు శనివారం అపహరించారు. వీటి విలువ సుమారు రూ.1.85 కోట్లు ఉంటుందని చీరాల డీఎస్పీ మొయిన్ వివరాలు వెల్లడించారు.