News October 18, 2024

PHOTO: బాబు, పవన్‌తో మోదీ

image

హరియాణాలోని చండీగఢ్‌లో నిన్న జరిగిన NDA నేతల మీటింగ్‌లో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు పాల్గొన్న విషయం తెలిసిందే. ఇందులో మోదీ, బాబు, పవన్‌లు ఒకే ఫ్రేమ్‌లో ఉన్న ఫొటో నెట్టింట వైరలవుతోంది. మీటింగ్ హాల్‌లో పవన్‌ను చూసిన మోదీ ఆయనతో ఆప్యాయంగా మాట్లాడినట్లు కనిపిస్తోంది. పక్కనే బాబు కూడా ఉండగా ముగ్గురి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది.

Similar News

News October 9, 2025

వెండి ధరకు రెక్కలు.. ఒక్కరోజే రూ.7వేలు హైక్

image

HYD బులియన్ మార్కెట్‌లో కేజీ వెండి ధర ఇవాళ ఉదయం రూ.1,000, ఇప్పుడు మరో రూ.6వేలు పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.1,77,000కు చేరింది. కేవలం రెండు రోజుల్లోనే రూ.9,900 పెరగడం గమనార్హం. ఫ్యూచర్‌లో వెండి ధర ఊహించని విధంగా పెరుగుతుందని ట్రేడ్ నిపుణులు చెబుతుండటంతో ఇన్వెస్టర్లు సిల్వర్‌పై మొగ్గుచూపుతున్నారు. దీంతో భారీగా ధరలు పెరుగుతున్నాయి. ఇలానే కొనసాగితే నెలాఖరుకి రూ.2లక్షలకు చేరే ఛాన్స్ ఉంది.

News October 9, 2025

లంచం అడిగిన వైద్యుడు.. విధుల నుంచి తొలగింపు

image

AP: మానసిక వైకల్యమున్న కుమార్తెకు సదరం సర్టిఫికెట్ కోసం ఆమె తండ్రిని లంచం అడిగిన డాక్టర్‌ని విధుల నుంచి తొలగించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. కడప GGHలోని ఆ డాక్టర్ ఏప్రిల్‌లో ₹10వేలు డిమాండ్ చేశాడు. ₹7వేలు ఇస్తానన్నా అంగీకరించలేదు. రెండ్రోజుల్లో ఇవ్వాల్సిందేనని గడువు పెట్టాడు. ఫిర్యాదు రాగా ఏసీబీ విచారణలో వాస్తవమేనని తేలింది. దీంతో సర్వీసు నుంచి అతణ్ని తొలగించాలని మంత్రి ఆదేశాలిచ్చారు.

News October 9, 2025

ప్రభుత్వ చిత్తశుద్ధి లేమికి స్టే నిదర్శనం: కిషన్ రెడ్డి

image

TG: BC రిజర్వేషన్లపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ప్రజలకు లబ్ధి చేకూర్చాలని కాకుండా రాజకీయ ప్రయోజనం కోసం అసంబద్ధ బిల్లు, GO తీసుకొచ్చి డ్రామా చేస్తోందన్నారు. అటు ప్రభుత్వానికి ఎన్నికలు నిర్వహించే ఉద్దేశం లేదని TBJP చీఫ్ రామ్‌చందర్‌రావు, MP ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలోనే 50% పరిమితి పెట్టి ఇప్పుడు పెంపు అనడం CM అవగాహన లేమికి నిదర్శనమన్నారు.