News October 18, 2024

PHOTO: బాబు, పవన్‌తో మోదీ

image

హరియాణాలోని చండీగఢ్‌లో నిన్న జరిగిన NDA నేతల మీటింగ్‌లో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు పాల్గొన్న విషయం తెలిసిందే. ఇందులో మోదీ, బాబు, పవన్‌లు ఒకే ఫ్రేమ్‌లో ఉన్న ఫొటో నెట్టింట వైరలవుతోంది. మీటింగ్ హాల్‌లో పవన్‌ను చూసిన మోదీ ఆయనతో ఆప్యాయంగా మాట్లాడినట్లు కనిపిస్తోంది. పక్కనే బాబు కూడా ఉండగా ముగ్గురి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది.

Similar News

News October 9, 2025

గ్యాస్ సిలిండర్ ఎక్స్‌పైరీ తేదీని చెక్ చేయండిలా!

image

ఇంట్లో నెలల తరబడి గ్యాస్ సిలిండర్ ఉంచుతున్నారా? ఇది ప్రమాదమే. ఎందుకంటే వాటికీ ఎక్స్‌పైరీ తేదీ ఉంటుంది. సురక్షితమైన వాడకం కోసం దీనిని నిర్ణయించారు. దీనిని సిలిండర్ పైభాగంలో ముద్రిస్తారు. ఉదా.. ‘C-27’ అని ఉంటే 2027లో JUL- SEP మధ్య ముగుస్తుందని అర్థం. A అని ఉంటే JAN TO MAR, B- APR TO JUN, C-JULY TO SEP, D- OCT TO DEC అని తెలుసుకోవాలి. గడువైపోయిన వాటిని వాడకుండా ఉంటే ప్రమాదాలు జరగవు. SHARE IT

News October 9, 2025

గ్రూప్1 నియామకాలపై జోక్యానికి సుప్రీం నో

image

తెలంగాణలో గ్రూప్1 నియామకాలపై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రస్తుతం ఇదే అంశంపై ఈనెల 15న హైకోర్టులో విచారణ ఉన్న సమయంలో తాము ఇందులో జోక్యం చేసుకోబోమని పిటిషనర్‌కు స్పష్టం చేసింది. కాగా హైకోర్టు తుది తీర్పుకు లోబడే నియామకాలు ఉంటాయని ప్రకటించింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అభ్యర్థులను సెలక్ట్ చేసింది.

News October 9, 2025

భారత్ నుంచి నోబెల్ అందుకున్నది వీరే..

image

<<17948949>>నోబెల్<<>> పురస్కారం అందుకున్న తొలి భారతీయుడిగా రవీంద్రనాథ్ ఠాగూర్(1913-సాహిత్యం) నిలిచారు. 1930లో సి.వి.రామన్(ఫిజిక్స్), 1979లో మదర్ థెరిసా(శాంతి), 1998లో అమర్త్యసేన్(అర్థశాస్త్రం), 2014లో కైలాశ్ సత్యార్థి(శాంతి) ఈ జాబితాలో ఉన్నారు. భారత సంతతి వారిలో హరగోవింద్ ఖొరానా(వైద్యశాస్త్రం), సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్(ఖగోళ భౌతిక), వెంకట్రామన్ రామకృష్ణన్(రసాయన), అభిజిత్ బెనర్జీ(అర్థశాస్త్రం) ఉన్నారు.