News January 16, 2025
PHOTO: చంద్రబాబుతో నితీశ్ కుమార్ రెడ్డి

టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ నితీశ్ కుమార్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా నితీశ్కు సీఎం రూ.25 లక్షల చెక్కును అందజేశారు. అంతర్జాతీయ గడ్డపై చరిత్ర సృష్టించి తెలుగువారు గర్వపడేలా చేశాడని చంద్రబాబు కొనియాడారు. భవిష్యత్తులో మరింత రాణించాలని ఆకాంక్షించారు. నితీశ్ వెంట ఆయన తండ్రితో పాటు ACA అధ్యక్షుడు ఉన్నారు.
Similar News
News January 29, 2026
రాష్ట్రంలో 140 పోస్టులు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీలో 140 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. మొత్తం పోస్టుల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ 79, అసోసియేట్ ప్రొఫెసర్ 44, ప్రొఫెసర్ 17 ఉన్నాయి. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ, PhDతో పాటు బోధన, రీసెర్చ్ అనుభవం గలవారు అర్హులు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://skltghu.ac.in/
News January 29, 2026
అమరావతిలో న్యూఇండియా అష్యూరెన్స్ కంపెనీ

AP: రాజధాని అమరావతిలో ది న్యూఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్(NIACL) రీజినల్ ఆఫీస్ ఏర్పాటు చేయనుంది. ఉద్దండరాయునిపాలెం, వెలగపూడి పరిధిలో రూ.100కోట్లతో ఆఫీస్ నిర్మాణం చేపట్టనుంది. ఈ మేరకు నిన్న CRDA అధికారులతో ఆ కంపెనీ చీఫ్ రీజినల్ మేనేజర్ వి.రాజా ఒప్పందం చేసుకున్నారు. టెక్నికల్, ఫైనాన్స్, మార్కెటింగ్ తదితర విభాగాల్లో 200-225 మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
News January 29, 2026
మేడారం జాతరలో మహిళ ప్రసవం

TG: మేడారం వనదేవతల సన్నిధిలో ఓ మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. HYD మౌలాలీకి చెందిన నిండు గర్భిణి రజిత జాతరకు వెళ్లారు. ఇవాళ తెల్లవారుజామున ఆమెకు పురిటి నొప్పులు మొదలవడంతో మేడారంలోని ప్రధాన ఆస్పత్రికి తరలించారు. DMHO డా.అప్పయ్య పర్యవేక్షణలో వరంగల్ CKM ఆస్పత్రి వైద్యులు రమ్య, నికిత ఆమెకు సుఖప్రసవం చేశారు. రజిత మగబిడ్డకు జన్మనివ్వగా, తల్లీబిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు.


