News September 1, 2024

PHOTO: బీచ్‌లో స్టార్ కపుల్స్

image

ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కర్ణాటకలోని కుందాపుర బీచ్‌లో సరదాగా గడిపారు. ఇరువురూ తమ సతీమణులతో కలిసి తీసుకున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ అంతకుముందు కుటుంబంతో కలిసి ఉడుపి శ్రీకృష్ణ దేవాలయాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే. కాగా ఎన్టీఆర్, ప్రశాంత్ కాంబోలో రానున్న సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఆ మూవీని 2026లో రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇదివరకే ప్రకటించారు.

Similar News

News November 24, 2025

ఉయ్యాలవాడకు వైఎస్ జగన్ నివాళి

image

​ఆంగ్లేయులపై తొలి తిరుగుబాటు చేసి బ్రిటీష్ వ్యతిరేక పోరాటానికి నాంది పలికిన స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జయంతి సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. ఆయన ధైర్యసాహసాలు చిరస్మరణీయమని కొనియాడారు. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు విమానాశ్రయానికి నరసింహారెడ్డి పేరు పెట్టడం మనందరికీ గర్వకారణమని జగన్ పేర్కొన్నారు.

News November 24, 2025

ఐబొమ్మ రవి ఎలా చిక్కాడంటే?

image

ఐబొమ్మ రవి పోలీస్ కస్టడీ నేటితో ముగియనుంది. ఇప్పటివరకు అతడు వెబ్‌సైట్లకు సంబంధించి ఎలాంటి కీలక సమాచారం చెప్పలేదని తెలుస్తోంది. దీంతో కోర్టులో హాజరుపర్చి మరోసారి కస్టడీకి ఇవ్వాలని కోరనున్నట్లు సమాచారం. ఇక రవి అరెస్టుపై కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. HYD వచ్చిన రవి ఫ్లాట్‌కు రమ్మంటూ తన ఫ్రెండ్‌‌కు మెసేజ్ చేశాడు. అప్పటికే ఫ్రెండ్ నంబర్ సంపాదించిన పోలీసులు మెసేజ్ రాగానే వెళ్లి రవిని అరెస్ట్ చేశారు.

News November 24, 2025

నకిలీ వెబ్‌సైట్ల కలకలం.. శ్రీశైలం భక్తులకు అలర్ట్

image

AP: శ్రీశైలంలో వసతులు కల్పిస్తామంటూ AP టూరిజం, శ్రీశైలం దేవస్థానం పేరుతో ఫేక్ వెబ్‌సైట్ల ద్వారా దుండగులు మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి ₹30Kతో రూమ్స్ బుక్ చేశారు. అక్కడికి వచ్చి రశీదు చూపించగా సిబ్బంది నకిలీదని చెప్పడంతో షాకయ్యారు. ఇలాగే పలువురు మోసాలకు గురయ్యారు. దీంతో ఆయా వెబ్‌సైట్లపై సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు EO శ్రీనివాసరావు తెలిపారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.