News August 26, 2024
PHOTO: వరల్డ్కప్ వినాయకుడు వచ్చేశాడు

మన దేశంలో ఏడాదిలో జరిగిన అద్భుతమైన ఘటనలతో వినాయకులను తయారు చేసి అభిమానాన్ని చాటుకోవడం ఎప్పటి నుంచో కొనసాగుతోంది. ఈ ఏడాది టీ20WCను భారత జట్టు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ముంబైలో కొందరు భక్తులు టీ20 వరల్డ్కప్ థీమ్తో గణేశుడిని రూపొందించారు. ట్రోఫీని మూషికుడు ఎత్తుకోగా గణేశుడి చేతిలో జెండాతో ఉన్న విగ్రహం వైరలవుతోంది. ఈ విగ్రహాన్ని ముంబై నగరంలో వినాయకచవితి రోజున ప్రతిష్ఠించనున్నట్లు సమాచారం.
Similar News
News January 10, 2026
20 డ్రోన్ కెమెరాలతో నిఘా: మేడారం SP

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు ఈసారి ప్రత్యేక నిఘా ఏర్పాట్లను చేసినట్లు ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ తెలిపారు. జాతరలో మునుపేన్నడు లేనివిధంగా 20 డ్రోన్ కెమెరాలను సిద్ధం చేస్తున్నామన్నారు. రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో డ్రోన్ ద్వారా పర్యవేక్షణ చేస్తామని, ఎక్కడైనా ఇబ్బంది ఉంటే వెంటనే అక్కడికి పోలీసులు చేరుకుంటారన్నారు. జంపన్నవాగు, ఆర్టీసీ, గద్దెలు, ప్రధాన కూడళ్లలో సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.
News January 10, 2026
నీటి విషయంలో రాజీపడేది లేదు: CBN

AP: నీటి విషయంలో గొడవలకు దిగితే నష్టపోయేది తెలుగు ప్రజలేనని సీఎం చంద్రబాబు అన్నారు. ‘నీటి సద్వినియోగం వల్లే రాయలసీమలో హార్టికల్చర్ అభివృద్ధి చెందింది. 2020లో నిలిపివేసిన రాయలసీమ లిఫ్ట్తో స్వార్థ రాజకీయాలు చేస్తున్నారు. మట్టి పనులు చేసి రూ.900 కోట్లు బిల్లులు చేసుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం.. నీటి విషయంలో రాజీ లేదు’ అని టీడీపీ కార్యాలయంలో మీడియాతో చిట్చాట్లో స్పష్టం చేశారు.
News January 10, 2026
భారీ స్కోరు చేసిన గుజరాత్ జెయింట్స్

WPL-2026లో యూపీ వారియర్స్తో మ్యాచులో గుజరాత్ జెయింట్స్ 20 ఓవర్లలో 207-4 స్కోరు చేసింది. కెప్టెన్ గార్డ్నర్(65) అర్ధసెంచరీతో అదరగొట్టగా అనుష్క(44), సోఫీ డివైన్(38) సహకారం అందించారు. చివర్లో జార్జియా మెరుపులు మెరిపించి 10 బంతుల్లో 3 సిక్సర్లు, ఒక ఫోర్తో 27* రన్స్ చేయడంతో స్కోరు బోర్డు 200 దాటింది. యూపీ బౌలర్లలో సోఫీ 2 వికెట్లు, శిఖా పాండే, డాటిన్ తలో వికెట్ తీశారు. UP టార్గెట్ 208.


