News November 17, 2024

PHOTOS: బీజేపీ నేతల ‘మూసీ నిద్ర’

image

TG: ‘మూసీ ప్రక్షాళన చేయండి. కానీ పేదల ఇళ్లు కూలగొట్టకండి’ అనే నినాదంతో మూసీ పరీవాహక ప్రాంతాల్లో బీజేపీ నేతలు నిద్ర చేస్తున్నారు. కిషన్ రెడ్డి, కె.లక్ష్మణ్, ఈటల రాజేందర్‌తో పాటు మరి కొంతమంది నేతలు వేర్వేరు చోట్ల బాధితులతో ముచ్చటించారు. అంబర్‌పేట నియోజకవర్గంలోని తులసిరాం నగర్ బస్తీలో కిషన్ రెడ్డి, ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఈటల రోడ్డుపై బైఠాయించి బాధితులకు మద్దతు తెలిపారు.

Similar News

News February 18, 2026

అకౌంట్లలోకి డబ్బులు.. ఎప్పుడంటే?

image

PM కిసాన్ కింద 22వ విడత నిధులకు సమయం ఆసన్నమైంది. ఈ నెల 22న కేంద్ర ప్రభుత్వం అర్హులైన రైతుల ఖాతాల్లో రూ.2,000 చొప్పున జమ చేయాలని భావిస్తోంది. అయితే తేదీపై ప్రకటన రావాల్సి ఉంది. ఆ రోజు కుదరకపోతే ఈ నెల చివరిలోగా డబ్బులు జమ చేయాలని యోచిస్తోంది. PM కిసాన్ కింద కేంద్రం ఏటా మూడు విడతలుగా రూ.6,000 అందిస్తోంది. లబ్ధి పొందేందుకు ఇప్పటివరకు <>ఈ-కేవైసీ<<>> చేయనివారు వెబ్‌సైట్‌లోకి వెళ్లి పూర్తి చేయండి.

News February 18, 2026

పిల్లలకు డబ్బాపాలు పడుతున్నారా?

image

డబ్బా పాలు పట్టే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. * అత్యవసరం అయితే తప్పా డబ్బా పాలు పట్టకూడదు. సీసాలో ఇస్తున్నప్పుడు గ్యాప్ తీసుకుంటూ ఇవ్వాలి. డబ్బా పాలే కదా అని పడుకోబెట్టి ఇవ్వకూడదు. * నెలలు నిండని పిల్లల్లో అవయవాలు ఎదగక కూడా పాలు పట్టినప్పుడు జీర్ణాశయంలోకి సాఫీగా వెళ్లక అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. శిశువుల ఎదుగుదలను బట్టి, వారి వయసుకు అనుగుణంగా వైద్యుడి సలహా మేరకు మాత్రమే పాలు పట్టాలి.

News February 18, 2026

మారుతీ తొలి ఈవీ SUV కారు.. ఫీచర్స్ ఇవే!

image

ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ తమ తొలి బ్యాటరీ రెంటల్ వాహనం ‘ఈ-విటారా’ SUVని గ్రాండ్‌గా లాంచ్ చేసింది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 543 కి.మీ దూసుకెళ్లనుంది. బ్యాటరీ యూజ్ ఎ సర్వీస్ ఓనర్‌షిప్ కింద ప్రారంభ ధర రూ.10.99లక్షలుగా ఉంది. మొదలవుతుంది. బ్యాటరీ యూసేజ్ రెంట్ ఛార్జీ కి.మీకు రూ.3.99 చొప్పున చెల్లించాలి. ఈవీ లాంచ్‌తో నిన్న మారుతీ షేర్లు లాభాల్లో ముగిశాయి.