News August 9, 2025

PHOTOS: సెలబ్రిటీస్ రాఖీ సెలబ్రేషన్స్

image

రాఖీ పర్వదినం సందర్భంగా దేశవ్యాప్తంగా కోలాహలం నెలకొంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు సంబరాల్లో పాల్గొన్నారు. పలువురు సినీ, క్రికెట్ ప్రముఖులు రాఖీ సెలబ్రేషన్స్ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. రకుల్ ప్రీత్, జెనీలియా, నిహారిక, సారా అలీ ఖాన్, కంగనా రనౌత్ తదితరులు తమ సోదరులకు రాఖీలు కట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ ఫొటోలను పైన గ్యాలరీలో చూడొచ్చు.

Similar News

News August 10, 2025

భారీ వర్షాలు.. ప్రజలు సహకరించాలన్న మంత్రి పొన్నం

image

TG: వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ వాసులు ప్రజారవాణాను ఉపయోగించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. వర్షాలపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆకస్మిక భారీ వర్షాలు కురుస్తున్నాయని, వర్షం తగ్గగానే అందరూ ఒకేసారి రోడ్ల మీదకు రావడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని చెప్పారు. కాస్త సమయం తీసుకొని రోడ్లపైకి వచ్చి ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

News August 10, 2025

కమల్ తల నరికేస్తా.. సహనటుడి వార్నింగ్

image

సనాతన <<17297271>>ధర్మానికి<<>> వ్యతిరేకంగా మాట్లాడినందుకు నటుడు కమల్ హాసన్‌ను సీరియల్ నటుడు రవిచంద్రన్ బెదిరింపులకు గురిచేశారు. కమల్ తల నరికివేస్తానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో రవిచంద్రన్‌పై మక్కల్ నీది మయ్యం పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతకుముందు సనాతన సిద్ధాంతాలను బ్రేక్ చేసే ఆయుధం విద్య అంటూ కమల్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి.

News August 10, 2025

పులివెందులలోని పోలింగ్ కేంద్రాలన్నీ సమస్యాత్మకమే: కడప ఎస్పీ

image

AP: ఈ నెల 12న జరగనున్న పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉపఎన్నిక పోలింగ్‌కు పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టినట్లు కడప SP అశోక్ కుమార్ తెలిపారు. ‘రెండు ప్రాంతాల్లో 1,100 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశాం. పులివెందుల జడ్పీటీసీ పరిధిలోని పోలింగ్ కేంద్రాలన్నీ సమస్యాత్మకం. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలుంటాయి. ఈ 2 మండలాల్లో స్థానికేతరులు ఉండకూడదు’ అని SP ఆదేశించారు.