News March 10, 2025

PHOTOS: ట్రోఫీతో క్రికెటర్లు

image

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని నెగ్గి భారత జట్టు 12 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. ధోనీ సారథ్యంలో 2013లో గెలిచాక 2017లోనూ అవకాశం వచ్చినా ఫైనల్లో పాక్ చేతిలో ఓటమి పాలైంది. అయితే ఈ సారి వచ్చిన ఛాన్స్‌ను రోహిత్ సేన ఒడిసిపట్టుకుంది. హిట్ మ్యాన్ నాయకత్వంలో సమిష్టిగా రాణిస్తూ ఒక్క ఓటమి లేకుండా కప్పును అందుకుంది. ఈ క్రమంలో కప్పుతో క్రికెటర్లు ఫొటోలకు పోజులిచ్చారు.

Similar News

News March 10, 2025

నేడు గ్రూప్-1 రిజల్ట్

image

TG: నేడు గ్రూప్-1 ఫలితాలను టీజీపీఎస్సీ ప్రకటించనుంది. ఈ మేరకు ప్రొవిజనల్ మార్కుల జాబితాను రిలీజ్ చేయనుంది. మొత్తం 563 పోస్టులకు‌గానూ గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన మెయిన్స్‌కు 21,093 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇక రేపు గ్రూప్-2 అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ లిస్ట్, 14న గ్రూప్-3 పరీక్ష జనరల్ ర్యాంకింగ్ జాబితాను రిలీజ్ చేయనున్నారు.

News March 10, 2025

TDP సీనియర్లకు నిరాశ.. ముందుగానే ఫోన్లు

image

AP: MLA కోటా MLC సీటు ఆశించిన పలువురు TDP సీనియర్లకు నిరాశ ఎదురైంది. అయితే అభ్యర్థులను ప్రకటించక ముందే వారికి రాష్ట్ర TDP అధ్యక్షుడు పల్లా నుంచి ఫోన్లు వెళ్లాయి. ఏ కారణం వల్ల పరిగణనలోకి తీసుకోవట్లేదో వివరించి, భవిష్యత్తులో అవకాశం కల్పిస్తామని CM మాటగా వివరించారు. దేవినేని ఉమ, పిఠాపురం వర్మ, KS జవహర్, మాల్యాద్రి, వంగవీటి రాధా, టీడీ జనార్దన్, దువ్వారపు రామారావు, అశోక్ బాబు తదితరులకు నచ్చజెప్పారు.

News March 10, 2025

నేటి నుంచి ధర్మపురి నృసింహుని బ్రహ్మోత్సవాలు

image

TG: ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి బ్రహ్మోత్సవాలు ఇవాళ్టి నుంచి ఈనెల 22 వరకు జరగనున్నాయి. నేడు పుట్ట బంగారంతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. రేపు సాయంత్రం స్వామివారి కళ్యాణ వేడుకలు జరగనున్నాయి. 14, 15, 16 తేదీల్లో తెప్పోత్సవం, డోలోత్సవం, 16, 17, 18 తేదీల్లో స్వామివార్ల దక్షిణ, ఉత్తర దిగ్యాత్ర కార్యక్రమాలు చేపడతారు. 19న రథోత్సవం, 20, 21, 22 తేదీల్లో ఉత్సవమూర్తుల ఏకాంతోత్సవాలను జరిపిస్తారు.

error: Content is protected !!