News September 27, 2025
PHOTOS: వైభవంగా తిరుమల బ్రహ్మోత్సవాలు

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ ముత్యపుపందిరి వాహనంపై మలయప్ప స్వామి ఉభయదేవేరులతో ఊరేగారు. తెల్లటి ముత్యాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన వాహనంలో ఆసీనులై శ్రీకృష్ణుడి అవతారంలో రుక్మిణీ సత్యభామతో కలిసి భక్తులకు అభయమిచ్చారు. 10 రాష్ట్రాల నుంచి వచ్చిన 482 మంది కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు. తెలంగాణ నుంచి వచ్చిన బృందం లంబాడీ నృత్యంతో అలరించింది.
Similar News
News February 8, 2026
భారీగా తగ్గనున్న హార్లే డేవిడ్సన్ బైక్ ధరలు!

ఇండియాతో ట్రేడ్ డీల్ నేపథ్యంలో USకు చెందిన కార్లు, బైకుల ధరలు తగ్గనున్నాయి. 800-1600CC ఇంజిన్ కెపాసిటీ ఉన్న బైక్స్పై ఎలాంటి టారిఫ్స్ ఉండవని అధికారులు తెలిపారు. దీంతో హార్లే డేవిడ్సన్ బైకు ధరలు భారీగా తగ్గనున్నాయి. గతేడాది 1600CC లోపు వాహన దిగుమతులపై 50%గా ఉన్న టారిఫ్స్ను 40%కు కేంద్రం తగ్గించింది. తాజాగా 3000 CC కంటే ఎక్కువ సామర్థ్యమున్న హైఎండ్ కార్లపై టారిఫ్స్ను 110% నుంచి 30%కు కుదించింది.
News February 8, 2026
రైతుల ఖాతాల్లోకి డబ్బులు.. UPDATE

TG: యాసంగికి సంబంధించి రైతు భరోసా నిధుల పంపిణీకై RBIకి రూ.9వేల కోట్ల రుణం కోసం ప్రభుత్వం ఇండెంటు పెట్టింది. 13 ఏళ్ల కాలపరిమితితో రూ.2వేల కోట్లు, 16 ఏళ్ల కాలపరిమితితో రూ.2వేల కోట్లు, 21 ఏళ్లతో రూ.2,500 కోట్లు, 27 ఏళ్లతో రూ.2,500 కోట్ల రుణం తీసుకోనుంది. ఈ నెల 10న ఈ రుణం ప్రభుత్వ ఖాతాలో జమ కానుంది. కాగా మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా(ఎకరాకు రూ.6,000) ఇస్తామని CM ప్రకటించిన సంగతి తెలిసిందే.
News February 8, 2026
జీడిమామిడిలో ‘టీ దోమ’ ఉద్ధృతి.. నివారణ ఎలా?

ప్రస్తుతం జీడిమామిడి తోటల్లో ‘టీ దోమల’ ఉద్ధృతి పెరిగింది. ఇవి పంట లేత చిగుళ్లు, పూత, పూత కాడలు, చిన్న కాయలను ఆశించి రసం పీలుస్తాయి. వీటిని సకాలంలో నివారించకుంటే పంట దిగుబడి భారీగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఈ తేయాకు దోమల కట్టడికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాగే జీడిమామిడిలో ఆకు, పూత, కాయమచ్చ తెగులు నివారణకు నిపుణుల సూచనల కోసం <<-se_10015>>పాడిపంట కేటగిరీ క్లిక్<<>> చేయండి.


