News June 12, 2024

PIC OF THE DAY

image

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక స్టేజీపై ఉన్న కేంద్ర మంత్రులకు నమస్కరించారు. ఆ సమయంలో ఆయనను గౌరవిస్తూ కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, నడ్డా, రామ్ మోహన్ నాయుడు, చిరాగ్ పాస్వాన్, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు లేచి నిలబడి నమస్కరించారు. ఈ ఫొటోను టీడీపీ శ్రేణులు షేర్ చేస్తూ ‘PIC OF THE DAY’ అని పోస్ట్ చేస్తున్నాయి. కేంద్రంలోని NDA ప్రభుత్వంలో చంద్రబాబు కీలకంగా ఉన్నారు.

Similar News

News December 13, 2025

రామేశ్వరం కేఫ్‌లో కేటీఆర్, అఖిలేశ్

image

TG: హైదరాబాద్‌లో పర్యటిస్తున్న యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఇవాళ రామేశ్వరం కేఫ్‌ను సందర్శించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో కలిసి అక్కడికి వెళ్లారు. కేఫ్‌లో వారిద్దరూ టిఫిన్ చేశారు. ఈ ఫొటోలను కేటీఆర్ తన X ఖాతాలో షేర్ చేశారు. కాగా నిన్న హైదరాబాద్‌కు వచ్చిన అఖిలేశ్.. తొలుత సీఎం రేవంత్ రెడ్డితో, తర్వాత కేటీఆర్‌తో భేటీ అయ్యారు.

News December 13, 2025

మహిళలూ ఈ తప్పులు చేస్తున్నారా?

image

మహిళలు చేసే కొన్ని తప్పులు గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయంటున్నారు నిపుణులు. 30 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి ఏడాదీ స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవాలి. ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, తక్కువ పండ్లు, కూరగాయలు తిన్నప్పుడు ఆహారంలో యాంటీఆక్సిడెంట్లు లోపిస్తాయి. దీంతో రోగనిరోధక శక్తి తగ్గి HPV ఇన్ఫెక్షన్‌‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువ. వీటితో పాటు గర్భధారణలో చేసే తప్పులు కూడా దీనికి కారణమంటున్నారు.

News December 13, 2025

HILTP: భూ బదిలీకి ఒక్క దరఖాస్తూ రాలేదు

image

TG: హిల్ట్ (HILT) విధానం కింద పారిశ్రామిక భూముల బదిలీ కోసం రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (TSIIDC)కు ఇంకా ఎలాంటి దరఖాస్తులూ అందలేదు. తెలంగాణలో 21 పారిశ్రామికవాడలు ఉన్నాయి. HILTను NOV 22న ప్రకటించారు. దీని కింద భూముల బదిలీకి ప్రభుత్వం అవకాశం కల్పించింది. అయితే పరిశ్రమల యాజమాన్యాల నుంచి ఎలాంటి స్పందన రాలేదని అధికారులు తెలిపారు. త్వరలోనే యాజమాన్యాలతో ప్రభుత్వం భేటీ కానుంది.