News June 27, 2024
PIC OF THE DAY
ఉమ్మడి కర్నూలు జిల్లాలో పలుచోట్ల వాతావరణం చల్లగా మారింది. ఆకాశంలో మేఘాలు దట్టంగా కమ్ముకుని ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. చిటపట చినుకులు కురిపించేందుకు నల్లటి మేఘాలు సిద్ధంగా ఉన్నట్లు చూపరులకు అనిపిస్తోంది. అందమైన వాతావరణం ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుండగా మహానంది సమీపంలో ఓ నెటిజన్ క్లిక్ మనిపించిన దృశ్యం ఆకట్టుకుంటోంది.
Similar News
News October 29, 2024
కర్నూలు: కారును ఢీకొన్న లారీ.. వ్యక్తి దుర్మరణం
గోనెగండ్ల మండల పరిధిలోని ఎస్.లింగందిన్నె వద్ద కారును లారీ ఢీకొన్న ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. అనంతపురం జిల్లా కొనకండ్లకు చెందిన కుమ్మరి హేమాద్రి, భార్య, కుమారుడు, కుమార్తెతో కలిసి మంగళవారం కర్నూలుకు వెళ్తుండగా ఎస్.లింగందిన్నె సమీపంలో లారీ రివర్స్లో వచ్చి కారును ఢీకొంది. హేమాద్రికి తీవ్ర గాయాలు కావడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కోలుకోలేక హేమాద్రి(38) మృతి చెందాడు.
News October 29, 2024
ట్రాన్స్ జెండర్లకు సహాయ సహకారాలు: కలెక్టర్
ప్రభుత్వం తరఫున ట్రాన్స్ జెండర్లకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్ రంజిత్ బాషా పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ట్రాన్స్ జెండర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ట్రాన్స్ జెండర్కు పెన్షన్ అందించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
News October 29, 2024
డీఐజీని కలిసిన పదోన్నతులు పొందిన ఎస్ఐలు
కర్నూలు రేంజ్ డీఐజీ కార్యాలయంలో పదోన్నతులు పొందిన 11 మంది ఎస్ఐలు డీఐజీ కోయ ప్రవీణ్ను మంగళవారం కలిశారు. పదోన్నతులు రావడం అభినందనీయమని, మిగిలిన సర్వీసును కూడా రిమార్కు లేకుండా పూర్తి చేయాలని డీఐజీ వారికి సూచించారు. విధులలో మంచి ప్రతిభ కనబరచి మరిన్ని పదోన్నతులు పొందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీఐజీ మేనేజర్ విజయరాజు ఉన్నారు.